Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మళ్లీ అండర్వరల్డ్ మీద ఫోకస్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ
అండర్ వరల్డ్ సినిమాలంటే మనకు ముందుగా గుర్చొచ్చేది రామ్ గోపాల్ వర్మ పేరు. సత్య, కంపెనీ లాంటి సినిమాల్లో అండర్ వరల్డ్ మాఫియా గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే కేవలం మూడు గంటల సినిమాలో ఏదైనా అంశాన్ని కూలంకశంగా చూపించడం ఏ దర్శకుడికైనా కష్టమే. అలా సాధ్యం కాని వాటిని వెబ్ సిరీస్ రూపంలోకి తెస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఇపుడు ఇదే దారిలో ప్రయాణిస్తున్నారు.
త్వరలో 'డి-కంపెనీ' పేరుతో వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు వర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. ముంబై మాఫియా నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని, మొత్తం ఐదు సీజన్లుగా దీన్ని ప్లాన్ చేస్తున్నామని, ఒక్కో సీజన్లో 10 ఎపిసోడ్లు ఉంటాయని తెలిపారు.
ఈ వెబ్ సిరీస్ కోసం గడిచిన 20 ఏళ్ల నాటి ఎన్నో విషయాలు సేకరించామని, ముంబై అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రస్తావన ఇందులో ఉంటుందని, ఈ ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఇందులో చూపించబోతున్నామని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.
బాలీవుడ్ నిర్మాత మధు మంతెన కూడా ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారట. ఇలాంటి సినిమాలు తీయడంలో ఎక్స్పర్ట్ అయిన వర్మ వెబ్ సిరీస్లో ఎన్నో కఠిన వాస్తవాలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది హిందీతో పాటు తెలుగులోనూ విడుదలవుతుందని సమాచారం.