Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మళ్లీ అండర్వరల్డ్ మీద ఫోకస్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ
అండర్ వరల్డ్ సినిమాలంటే మనకు ముందుగా గుర్చొచ్చేది రామ్ గోపాల్ వర్మ పేరు. సత్య, కంపెనీ లాంటి సినిమాల్లో అండర్ వరల్డ్ మాఫియా గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే కేవలం మూడు గంటల సినిమాలో ఏదైనా అంశాన్ని కూలంకశంగా చూపించడం ఏ దర్శకుడికైనా కష్టమే. అలా సాధ్యం కాని వాటిని వెబ్ సిరీస్ రూపంలోకి తెస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఇపుడు ఇదే దారిలో ప్రయాణిస్తున్నారు.
త్వరలో 'డి-కంపెనీ' పేరుతో వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు వర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. ముంబై మాఫియా నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని, మొత్తం ఐదు సీజన్లుగా దీన్ని ప్లాన్ చేస్తున్నామని, ఒక్కో సీజన్లో 10 ఎపిసోడ్లు ఉంటాయని తెలిపారు.
ఈ వెబ్ సిరీస్ కోసం గడిచిన 20 ఏళ్ల నాటి ఎన్నో విషయాలు సేకరించామని, ముంబై అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రస్తావన ఇందులో ఉంటుందని, ఈ ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఇందులో చూపించబోతున్నామని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.
బాలీవుడ్ నిర్మాత మధు మంతెన కూడా ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారట. ఇలాంటి సినిమాలు తీయడంలో ఎక్స్పర్ట్ అయిన వర్మ వెబ్ సిరీస్లో ఎన్నో కఠిన వాస్తవాలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది హిందీతో పాటు తెలుగులోనూ విడుదలవుతుందని సమాచారం.