Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వర్మ 'రామాయణం' మొదటి సీన్ అదే
'దశరథరావు పెద్ద కుమారుడు రామ్ శంకర్. అయోధ్య గ్రూప్కీ సంబంధించిన ఒక యూనిట్ వనస్థలిపురంలో ఉంటుంది. అది నష్టాల్లో ఉంటుంది. దాన్ని రామ్శంకర్ టేకప్ చేస్తాడు. పంచవతి మినరల్వాటర్స్లో ఒక కొత్త యూనిట్ ఓపెనింగ్ సందర్భంగా ఇచ్చిన పార్టీకి శూర్పణ కూడా వస్తుంది. శూర్పణఆ పార్టీలో సీతాలక్ష్మితో ప్రవర్తించిన తీరుతో నా 'రామాయణం' మొదలవుతుంది' అని వర్మ ఓ ప్రకటనలో తెలిపారు. రామ్ గోపాల్ వర్మ రెండు రోజుల క్రితం రామాయణం చిత్రం తీస్తున్నానని ప్రకటించారు. ఆ వార్త వినగానే చాలా మంది రామాయణానికి అది ప్యారిడీ అవుతుందని కామెంట్స్ చేసారు. దానికి వర్మ సమాధానమిస్తూ ఇలా ప్రకటించారు. అలాగే..నేను నా స్టైల్లో రామాయణం తీయబోతున్నానని ప్రకటించినప్పటి నుంచీ చాలామంది అది ఒక పేరడీగానో, ఒక కామెడీగానో తీయబోతున్నానని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు.
నా రామాయణం చాలా హూందాగా, చాలా సీరియస్గానూ ఉంటుంది. 'సర్కార్' సినిమాలా ఫ్యామిలీ థ్రిల్లర్ను పోలి ఉంటుంది అన్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన తాజా చిత్రం బెజవాడు ఈ వారమే విడుదల అవుతోంది. అలాగే ఆయన ప్రస్తుతం డిపార్టమెంట్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. డిపార్టమెంట్ అనంతరం ఈ చిత్రం ఉండే అవకాసం ఉంది. ఈ చిత్రంలో నాగార్జునని ఓ కీ రోల్ కి అడిగినట్లు సమాచారం. తెలుగులో దర్శకత్వం ఇప్పుడప్పుడే చేసే ఆలోచన లేదని అన్నారు. బాలీవుడ్లో మాత్రం ఒక మ్యూజికల్ 'అబ్తక్ ఎ చప్పన్'అనే లవ్స్టోరీ చేస్తున్నానని చెప్పారు.