Don't Miss!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- News Iran Israel War: ఇరాక్ నూ కెలికిన ఇజ్రాయెల్? ఇరాన్ ఉమ్మడి పోస్టుపై దాడి-పోరు తీవ్రం..!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
చివరకి క్షమాపణ చెప్పిన రామ్ గోపాల్ వర్మ
హైదరాబాద్ :'దుల్కర్ని చూసి మమ్ముట్టి నటన నేర్చుకోవాలి' అని రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో పోస్ట్ చేస్తే..వెంటనే ''నేను పది జన్మలెత్తి ఎంత సాధించినా మా నాన్న స్థాయికి చేరుకోలేను'' అంటూ 'ఓకే బంగారం' హీరో దుల్కర్ ట్విట్టర్లో స్పందించాడు. వెంటనే తేరుకున్న వర్మ...ముమ్మట్టికి, అతని అభిమానులకు క్షమాపణలు అని, తన ట్వీట్స్ ని సరిగ్గా అర్దం చేసుకోలేదని చెప్పుకొచ్చారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
రామ్ గోపాల్ వర్మ ఇలా ట్వీట్ చేస్తూ...... నేను ఏం ఫీల్ అవుతానో అదో మాట్లాడుతాను అని అందరికీ తెలుసు. ఇదేమీ తొలిసారి కాదు. నేను నా ఆనందాన్ని ఇలా వ్యక్తం చేసాను...
అలాగే...నా ట్వీట్ల అర్దం... గొప్ప తండ్రికు...అద్బుతమైన కొడుకు అని... ఎవరికైతే నా ఈ అభినందనలు సరిగ్గా అర్దం కావో..వారికి నా క్షమాపణలు...దయిచేసి మీ తండ్రికి కూడా వివరించి చెప్పు...ఆయన కూడా అఫెండ్ అయితే... ఆయనకూ నా క్షమాపణలు...
"కానీ ఇప్పటికీ...నువ్వే మీ తండ్రి కన్నా చాలా చాలా గొప్పవాడివని అనుకుంటున్నాను..ఇది నేను నిజాయితీతో చెప్తున్న మాట..ప్రజాస్వామ్యంలో ఉన్న భారత పౌరడుగా నా అభిప్రాయం ఇలా వెల్లబుచ్చాను " అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు.
ప్రముఖ నటుడు మమ్ముట్టి తనయుడే దుల్కర్ సల్మాన్. మలయాళంలో విజయం సాధించిన 'బెంగళూర్ డేస్'తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. 'ఓకే బంగారం'లో ఆది పాత్రలో ప్రేక్షకుల్ని అలరించాడు.
దుల్కర్ మాట్లాడుతూ.. ''మణిరత్నంసార్ ఈ చిత్రాన్ని అందంగా మలిచారు. ఆయన సెట్లో అందరి సలహాలు తీసుకోవడం, మా అందరి అభిప్రాయాలను తెలుసుకోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. నటీనటులకు కావల్సినంత స్వేచ్ఛనిస్తారు. ఆయన సినిమాలే కాదు, సన్నివేశాన్ని వివరించే విధానమూ కొత్తగా ఉంటుంది. నిత్య మేనన్ చాలా ప్రొఫెషనల్. సందర్భం, సన్నివేశం చెబితే చాలు పాత్రలో ఇమిడిపోతుంది. ఈ సినిమాలోని సహజీవనం కాన్సెప్ట్పై ఒకొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. ఈ విషయంపై ఇంతకంటే నేనేమీ స్పందించలేను'' అన్నాడు.
''తెలుగు సినిమాలు చూస్తుంటా. పవన్ కల్యాణ్, మహేష్ బాబుల నటన నచ్చుతుంది. తెలుగు సినిమాల్లో నటించాలని ఉంది'' అన్నాడు దుల్కర్. అలాగే...''మణిరత్నం చిత్రంలో పనిచేయడం ఓ అందమైన అనుభవం. ఆ అదృష్టం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు..''అంటున్నాడు దుల్కర్ సల్మాన్.