Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వర్మ కొత్త చిత్రం రిలీజ్ డేట్ ఇచ్చేసారు
ఇక ఈ సినిమాని మొదట ఆగస్టు 15 న విడుదల చేయానికి నిర్ణయించి ప్రకటన చేసారు. అయితే మొట్ట మొదటి సారిగా వేలం పాట(ఆక్షన్) ద్వారా రిలీజ్ చేయనుండటంతో డిస్ట్రిబ్యూటర్స్ గురించి మరింత క్లారిటీ కోసం ఈ చిత్ర టీం సినిమా విడుదలని వాయిదా వేశామని చెప్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్ 'టెన్షన్ టెన్షన్' లేదా '12′ అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఈ రోజుతో ఆ వార్తలకి తెరపడింది. ఫైనల్ గా వర్మ సినిమాకి 'అనుక్షణం' అనే టైటిల్ ని ఖరారు చేసారు. 'అమ్మాయిలూ జాగ్రత్త' అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా పెట్టారు.
సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు విష్ణు సరసన తేజస్వి నటిస్తుండగా, మధు శాలిని ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. గతంలో విష్ణు, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో 'రౌడీ' సినిమా వచ్చింది. ఆ సినిమాలో విష్ణు నటనకి మంచి మార్కులు పడ్డాయి. వీరిద్దరూ మళ్ళీ అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తారని భావిస్తున్నారు.