Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
వైఎస్ఆర్పై వర్మ సినిమా! -‘రెడ్డిగారు పోయారు’
వివాదాస్పద, ఆసక్తికర అంశాలను సినిమా రూపంలో తెరకెక్కించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఇలాంటి కథాంశంతో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహానేత మరణం తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటలు, బయట పడ్డ కుంభ కోణాలు, సీఎం కుర్చీ కోసం ప్రాకులాడుతున్న వైనాన్ని ఈ చిత్రంలో చూపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమా గురించిన వివరాలు వెల్లడిస్తూ శనివారం ప్రెస్ నోట్ విడుదల చేసిన వర్మ...తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని, అయితే రాజకీయాల మనస్తత్వం తెలుసన్నారు. వైస్ఆర్ మరణం తర్వాత ఆంద్రప్రదేశ్ లో చోటు చేసుకున్న పరిణాలను బేస్ చేసుకుని సినిమా తీస్తున్నట్లు తెలిపారు. స్ర్కిప్టును రూపొందించే పనిలో ఉన్నామని, వచ్చే సంవత్సరం ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.
శ్రేయ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కిరణ్ కుమార్ కోనేరు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వైఎస్ఆర్ గురించి పాజిటివ్ గా ఉంటుందో...? లేక నెగెటివ్ గా ఉంటుందో..? సినిమా విడుదలైతే గానీ తెలీదు. మరి వర్మ తీయబోయే సినిమాపై ఆయన తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ స్పందన ఎలా ఉంటుందో? చూడాలి.