Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘రౌడీ’తో పూర్తి స్థాయి నటుడిగా మారానంటున్న విష్ణు
హైదరాబాద్: మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్ర ధారులుగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రౌడీ'. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ గురించి విష్ణు మాట్లాడుతూ...'చాలా కాలం తర్వాత కామెడీ లేకుండా ఓ సీరియస్ చిత్రంలో నటించాను. పూర్థి స్థాయి నటుడిననే సంతృప్తి కలిగింది. రామ్ గోపాల్ వర్మ నాలోని పూర్తి స్థాయి నటుడిని వెలికి తీసాడు' అని తెలిపారు.
ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, కమర్షియల్ హంగులతో పాటు ఈ చిత్రంలో ఉద్వేగానికి గురి చేసే సన్నివేశాలున్నాయని విష్ణు తెలిపారు. ''నాన్నగారి పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వర్మ పనితనం ఎలా ఉంటుందో, ఆయన సాంకేతిక నైపుణ్యం ఏమిటో ఈ సినిమాతో మరోసారి తెలుస్తుంది. ఇంటర్వెల్ ముందు ఓ పోరాట సన్నివేశం ఉంది. అది దాదాపు 11 నిమిషాల పాటు సాగుతుంది. ఆ సన్నివేశం నేనే మళ్లీ తెరపై చూస్తే.. ఒళ్లు గగుర్పొడిచింది. అంత శక్తిమంతంగా రూపొందించారు. జయసుధగారి పాత్ర.. మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అన్నారు.
రౌడీ' చిత్రంలో మోహన్బాబు, విష్ణు, జయసుధ, శాన్వి ప్రధాన పాత్రల్లో నటించారు. రామ్గోపాల్వర్మ దర్శకత్వం వహించారు. పార్థసారధి, గజేంద్ర, విజయ్కుమార్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 4వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రౌడీ ఆడియోకు మంచి స్పందన వస్తోందని నిర్మాతలు తెలిపారు.