Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆమె బాయ్ఫ్రెండు కంటే అనుష్క శర్మ బెటర్ అంటూ ట్వీట్
హైదరాబాద్: టీమిండిమా వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్లో ఓడిపోవడంతో క్రికెట్ ద్వేషి రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో తన దైన పదునైన ట్వీట్లతో రెచ్చి పోయాడు. విరాట్ కోహ్లి విఫలం అవ్వడానికి అనుష్క శర్మే కారణమని ఓ వైపు క్రికెట్ అభిమానులంతా ఆమెపై అబాండాలు వేస్తుంటే...వర్మ మాత్రం అనుష్క శర్మను వెనకేసుకొచ్చాడు.
‘నేను వ్యక్తిగతంగా అనుష్క శర్మను పెర్ఫార్మెన్స్ను చాలా చాలా ఇష్టపడతాను. ఆమె బాయ్ ఫ్రెండ్ పెర్ఫార్మెన్స్ కంటే అనుష్క శర్మ పెర్ఫార్మెన్స్ చాలా బెటర్ అంటూ ట్వీట్ చేసాడు. అంతే కాదు టీమిడియా ఓడి పోవడంపై చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ల వర్షం కురిపించాడు వర్మ.
I
personally
like
Anushka
Sharma's
performance
much
much
More
than
the
performance
of
whoever
and
whatever
her
boyfriend
is?
—
Ram
Gopal
Varma
(@RGVzoomin)
March
26,
2015
ఓ వైపు భారత క్రికెట్ అభిమానులంతా బాధలో ఉంటే...... నేను చాలా హ్యాపీగా ఉన్నానంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీటాడు. దేశానికి ‘క్రికెటైటిస్' అనే వ్యాధి పట్టిందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మందు, సిగరెట్ వల్ల నష్టం వ్యక్తుల వరకు మాత్రమే ఉంటుంది. కానీ క్రికెట్ వల్ల దేశానికి నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఆయన ట్వీట్స్ క్రింది విధంగా ఉన్నాయి.
టీమిండియా ఓడిపోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను క్రికెట్ ను ద్వేషిస్తాను. నేను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే క్రికెట్ను ద్వేషిస్తున్నాను. క్రికెట్ వల్ల దేశానికి చాలా నష్టం కలుగుతోంది. చాలా మంది క్రికెట్ మ్యాచ్ సమయంలో పని చేయకుండా టీవీలు చూస్తూ ఉండి పోతున్నారు అని వర్మ ట్వీట్ చేసారు.
‘క్రికెటైటిస్' అనే ప్రమాదకరమైన వ్యాధి నుండి ఈ దేశ పౌరులను కాపాడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. టీమిండియాను మళ్లీ మళ్లీ ఓడించాలని ఇతర దేశాల జట్లను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ దేశ పౌరులు క్రికెట్ చూడటం ఆపేసి, చక్కగా పని చేసుకునే ఆలోచన వచ్చే వరకు ఇలానే పదే పదే ఓడించాలని కోరుకుంటున్నాను అని వర్మ ట్వీట్ చేసారు.
ఆల్కహాల్, సిగర్ రెట్ లాంటి వాటికి బానిస అయితే....ఆ నష్టం వ్యక్తి వరకే పరిమితం అవుతుంది. కానీ ఈ దేశం క్రికెట్ కు బానిస అవుతే అది జాతీయ వ్యాధి అవుతుంది. ద్వేషించే వాళ్లను నేనే ప్రేమిస్తాను..ఎందుకంటే ద్వేషం ప్రేమకంటే స్పైసీగా ఉంటుంది అని వర్మ ట్వీట్ చేసాడు.