Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సచిన్
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమాకు రెడీ అయ్యారు. ఈ సారి ఆయన సచిన్ జోషితో సినిమా తీయబోతున్నాడు. తెలుగు-హిందీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలంగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న వర్మ ఇపుడు సచిన్ ద్వారా బాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
సచిన్ జోషి నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘నీ జతగా నేనుండాలి' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రా బాక్సీఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద పెద్దగా రాబట్టలేక పోయాయి. మరి ఇద్దరూ కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
నూతన సంవత్సర సంబరాల నేపథ్యంలో అందరూ సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటే.....వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అందరికీ విష్ యూ ఎ సాడ్ ఇయర్ అంటూ ట్వీట్ చేసాడు. ‘మనం ఎప్పుడూ నూతన సంవత్సరంలోకి పాత సంవత్సరానికి సంబంధించిన మన బాధలను కూడా తీసుకెలుతున్నాం. అందుకే నేను అందరికీ సాడ్ ఇయర్ అంటూ విష్ చేస్తున్నాను' అంటూ ట్వీట్ చేసారు. అయితే ప్రజలు ఎప్పటికీ కేవలం నమ్మకంతో జీవిస్తున్నారు. వారికి లాజిక్ తెలియదు. అందుకే హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ కూడా చెబుతున్నాను అంటూ మరో ట్వీట్ చేసాడు