Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
రంభతో పోలుస్తూ పవన్ కళ్యాణ్ పై వర్మ ట్వీట్
ముంబై : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా ట్వీట్ ని కెమెరామెన్ గంగ చిత్రం ట్రైలర్ ని ఉద్దేశిస్తూ చేసారు. ఆయన ట్వీట్ చేస్తూ..."రాంబాబు ట్రైలర్ దేముడు రాముడి బాబు లా ఉంది...గంగ ఎవరో నాకు తెలియదు కానీ జగన్ కెమెరాలో కళ్యాణ్ ..రంభ కన్నా అందంగా ఉన్నాడు." అన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. తన శిష్యుడైన పూరీ ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతీ సినిమాని వర్మ ఇలా ప్రమోట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
తమన్నా హీరోయిన్ గా చేస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం అత్యధిక ప్రింట్స్ తో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 18న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 సంవత్సరాల క్రితం వచ్చిన పవన్కళ్యాణ్, పూరిజగన్నాధ్ ల 'బద్రి' చిత్రం ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో విదితమే. మళ్లీ ఎప్పుడెప్పుడా ఆ కాంబినేషన్ అని ఎదురుచూసిన అభిమానులకు 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ద్వారా కనువిందు చేయనుందీ కాంబినేషన్ . సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. 'పవన్కళ్యాణ్ ఓ పవర్ఫుల్ జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. మంచి పవర్ఫుల్ సబ్జెక్ట్తో పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిమానులు అంతా మెచ్చేవిధంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ హైలెైట్గా ఉండబోతున్నాయి అన్నారు. అలాగే పూరి జగన్నాధ్ ప్రత్యేకంగా పవన్ కోసం రాసిన డెైలాగ్స్కు థియేటర్లో చప్పట్లు మార్మోగుతాయి. ఏకధాటిగా సింగిల్ షెడ్యూల్లో ఇంతటి భారీ చిత్రాన్ని పూర్తిచేయడానికి ప్రధాన కారణం పవన్కళ్యాణ్, పూరిల సహకారం. మా బ్యానర్లో పవన్కి బిగ్గెస్ట్ హిట్ రాబోతున్నందుకు సంతోషంగా ఉంది' అన్నారు.
పూరి జగన్నాధ్ మాట్లాడుతూ 'బద్రితో దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన పవన్కళ్యాణ్తో మళ్లీ ఇన్నేళ్లకు సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇది కచ్చితంగా పవన్కళ్యాణ్నుంచి ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి పవర్ఫుల్ సినిమా ఇది. పవన్ కెరీర్లోనే ఓ ల్యాండ్మార్క్ ఫిలిం అవుతుంది. ఇందులో ఓ సరికొత్త పవన్ కళ్యాణ్ను చూస్తారు' అన్నారు.హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ 'పవన్తో తొలిసారి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పైగా లీడ్ క్యారెక్టర్ గంగ నాకు ఎంతో బాగా నచ్చి చేస్తున్న చిత్రం' అన్నారు.
ప్రకాష్రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.