Don't Miss!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- News వివేకా హత్యపై మాట్లాడొద్దు- కడప కోర్టు సంచలన ఆదేశాలు..!
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Sports IPL 2024 ఫిక్సింగ్ కలకలం.. నలుగురు అరెస్ట్!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రవితేజ సంగతి మొదటిరోజే తెలిసింది: రిచా గంగోపాధ్యాయ
రవితేజ చాలా సరదా మనిషి అని అందరూ చెప్పుకొంటుంటే విన్నాను. ఎంత సరదాగా ఉంటారో మొదటి రోజే తెలిసింది. దాంతో ప్రతీరోజూ నేనేదో షూటింగ్కి వెళ్తున్నాను.. అని ఎప్పుడూ ఫీలవలేదు. కూల్ గా షూటింగ్ మొత్తం జరిగిపోయింది. సినిమా పూర్తయిపోయింది అని తెలియగానే బాధ కలిగింది. అంతగా ప్రతి నిమిషం ఆస్వాదించానంటే అదంతా రవితేజ వల్లే అంటూ చెప్పుకొచ్చింది రిచా గంగోపాధ్యాయ. ఆమె తాజా చిత్రం మిరపకాయ్. అందులో ఆమె వినమ్ర పాత్ర చేసింది. ఆ పాత్ర ప్రకారం లంగా,ఓణి కట్టుకుని,అమాయకమైన చూపులతో ఆకట్టుకుంది. అలాగే తనకు ఆ పాత్ర ఎలా వచ్చిందో చెపుతూ...దర్శకుడు హరీష్ శంకర్ వినమ్ర పాత్ర నా కోసమే రాసుకొన్నారు. అయితే 'లీడర్' పంక్షన్ లో నన్ను చూసి 'అమెరికా అమ్మాయివి కదా. లంగావోణీ పాత్ర నీకు నప్పదేమో. వైశాలిగా చేయ్' అన్నారు. కానీ నాకు వినమ్ర పాత్ర నచ్చింది. నేను ఎందుకు చేయలేను...అని సవాల్గా తీసుకొన్నాను. అప్పటికి షూటింగ్కి ఇంకా సమయం ఉండడంతో నా పాత్ర తీరుతెన్నులను బాగా పరిశీలించాను అందుకే క్లిక్కయింది అంటోంది.