Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆక్రమిత కాశ్మీర్ పాకిస్థాన్దే: బాలీవుడ్ సీనియర్ హీరో సంచలన వ్యాఖ్యలు
రిషికపూర్ పాకిస్థాన్ భజన చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్ దే అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఫరూక్ అబ్దుల్లా వాఖ్యలకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ ట్వీట్ చేశారు.
Recommended Video
ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ పాకిస్థాన్ భజన చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్ దే అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పాకిస్థాన్కే చెందుతుంది... పాక్, భారత్ మద్య ఎన్ని యుద్ధాలు జరిగినా ఇందులో మార్పుండదని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు వాఖ్యలకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ ట్వీట్ చేశారు.
ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా
పాకిస్థాన్ కు స్వాతంత్ర్యం కావాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్. స్పందించారు. ఆయన తన ట్విట్టర్ వేదికగా... " ఫరూక్ అబ్దుల్లా గారు, నమస్కారం. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా.
ఇదే కశ్మీర్ సమస్యకు పరిష్కారం
జమ్ముకశ్మీర్ మనది. పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్) వారిది. ఇదే కశ్మీర్ సమస్యకు పరిష్కారం. నా వయసు 65 ఏళ్లు. చనిపోయేలోగా పాకిస్థాన్ ను చూడాలనేది నా కోరిక. మా పిల్లలు పాక్ లోకి వాళ్ల మూలాలను చూడాలని కోరుకుంటున్నా. జై మాతా దీ", అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వివాదాస్పద ట్వీట్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.
రిషి తండ్రి పృథ్వీరాజ్ కపూర్
రిషికపూర్ పూర్వీకులు పాకిస్థాన్లో పెషావర్లో ప్రాంతంలో నివసించేవారు. 1918- 22 మధ్య కాలంలో ఆయన తాత దేవాన్ బశేశ్వర్నాథ్ కపూర్ అక్కడ ఓ భవంతిని నిర్మించారు. అయితే రిషి తండ్రి పృథ్వీరాజ్ కపూర్ సినీ రంగంలోకి రావడం, 1947 విభజన తర్వాత ఇండియాకు వచ్చేశారు.
ప్రేమతో భారత్లో కలవాలని
ఈ ట్వీట్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ప్రేమతో భారత్లో కలవాలని మనం నిర్ణయించుకున్నాం.... కానీ దేశం కశ్మీర్ ప్రజలను దగా చేసింది... వారి పట్ల సరిగా వ్యవహరించలేదని ఫరూక్ శనివారం విమర్శించారు. భారత్, చైనా, పాక్ లాంటి మూడు న్యూక్లియర్ శక్తులు మధ్య కశ్మీర్ లోయ ఉన్నందున స్వతంత్ర కశ్మీర్ మాటే తప్పని వ్యాఖ్యానించారు.