Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆక్రమిత కాశ్మీర్ పాకిస్థాన్దే: బాలీవుడ్ సీనియర్ హీరో సంచలన వ్యాఖ్యలు
రిషికపూర్ పాకిస్థాన్ భజన చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్ దే అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఫరూక్ అబ్దుల్లా వాఖ్యలకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ ట్వీట్ చేశారు.
Recommended Video
ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ పాకిస్థాన్ భజన చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్ దే అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పాకిస్థాన్కే చెందుతుంది... పాక్, భారత్ మద్య ఎన్ని యుద్ధాలు జరిగినా ఇందులో మార్పుండదని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు వాఖ్యలకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ ట్వీట్ చేశారు.
ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా
పాకిస్థాన్ కు స్వాతంత్ర్యం కావాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్. స్పందించారు. ఆయన తన ట్విట్టర్ వేదికగా... " ఫరూక్ అబ్దుల్లా గారు, నమస్కారం. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా.
ఇదే కశ్మీర్ సమస్యకు పరిష్కారం
జమ్ముకశ్మీర్ మనది. పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్) వారిది. ఇదే కశ్మీర్ సమస్యకు పరిష్కారం. నా వయసు 65 ఏళ్లు. చనిపోయేలోగా పాకిస్థాన్ ను చూడాలనేది నా కోరిక. మా పిల్లలు పాక్ లోకి వాళ్ల మూలాలను చూడాలని కోరుకుంటున్నా. జై మాతా దీ", అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వివాదాస్పద ట్వీట్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.
రిషి తండ్రి పృథ్వీరాజ్ కపూర్
రిషికపూర్ పూర్వీకులు పాకిస్థాన్లో పెషావర్లో ప్రాంతంలో నివసించేవారు. 1918- 22 మధ్య కాలంలో ఆయన తాత దేవాన్ బశేశ్వర్నాథ్ కపూర్ అక్కడ ఓ భవంతిని నిర్మించారు. అయితే రిషి తండ్రి పృథ్వీరాజ్ కపూర్ సినీ రంగంలోకి రావడం, 1947 విభజన తర్వాత ఇండియాకు వచ్చేశారు.
ప్రేమతో భారత్లో కలవాలని
ఈ ట్వీట్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ప్రేమతో భారత్లో కలవాలని మనం నిర్ణయించుకున్నాం.... కానీ దేశం కశ్మీర్ ప్రజలను దగా చేసింది... వారి పట్ల సరిగా వ్యవహరించలేదని ఫరూక్ శనివారం విమర్శించారు. భారత్, చైనా, పాక్ లాంటి మూడు న్యూక్లియర్ శక్తులు మధ్య కశ్మీర్ లోయ ఉన్నందున స్వతంత్ర కశ్మీర్ మాటే తప్పని వ్యాఖ్యానించారు.