Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దటీజ్ రాజమౌళి: ఇదీ 'బాహుబలి' టీజర్కు స్పందన
హైదరాబాద్: ప్రముఖ దర్శకులు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం 'బాహుబలి' శనివారం రాత్రి 7.30 గంటలకు విడుదలైన ఈ చిత్రం టీజర్ ఆన్లైన్లో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ టీజర్ను ఐదు లక్షల మందికి పైగా వీక్షించారు. విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం భారత టీజర్, పోస్టర్స్ తో సినీచరిత్రలోనే అద్భుత చిత్రంగా సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది.
అలాగే... ఈ చిత్రం ట్రైలర్ను సోమవారం ఉదయం 10.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ విడుదలైన వెంటనే అభిమానుల ఫేస్బుక్ పేజీపై వాల్పోస్ట్ పొందేందుకు ప్రత్యేక సదుపాయాన్ని కల్పించారు. ఇప్పటి వరకు ఇలా వాల్పోస్టు పొందేందుకు 17 వేల మంది అభిమానులు ఆసక్తి చూపించారు. ఈ సంఖ్య మరింత పెరుగుతోంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
మరో ప్రక్క 'బాహుబలి సినిమాకోసం వినియోగించిన వస్తువులతో ప్రత్యేకంగా ఓ మ్యూజియంని ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా ఒక సినిమా కోసం మ్యూజియం ఏర్పాటు చేయడం మన దేశంలో ఇదే తొలిసారి. 'బాహుబలి'లో నటీనటులు వాడిన ఆయుధాలు, వాళ్లు ధరించిన దుస్తులు, కవచాలు ఈ మ్యూజియంలో ప్రదర్శనకి ఉంచబోతున్నారు. రాజమౌళి ఆలోచనల మేరకే ఈ మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు.
ఇక టీజర్ విషయానికి వస్తే...
శనివారం రాత్రి 7.30కి 'బాహుబలి'కి సంబంధించిన ఓ టీజర్ని విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసారు...అభిమానులను ఆనందపరిచారు. 20 సెకన్లపాటు సాగే ఆ టీజర్ 'బాహుబలి' సినిమా స్థాయి ఏమిటో చాటి చెబుతోంది. వేలాది మంది సైనికులు పోరాటంలోకి దిగుతుండగా... రానా కత్తి దూసేందుకు సన్నద్ధమవుతూ ఆ టీజర్లో కనిపించాడు. చివరిగా ప్రభాస్ కళ్లను మాత్రమే చూపించారు. జూన్ 1న 2 నిమిషాల ట్రైలర్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్ హీరోగా నటించారు. అనుష్క, తమన్నాహీరోయిన్స్. రానా విలన్ గా కనిపిస్తారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. కీరవాణి సంగీతం అందించారు.