twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ శిల్పాశెట్టి ఇంట్లో దొంగలు పడ్డారు

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ఇంట్లో దొంగలు పడ్డారు. ముంబై జుహులోని ఆమె నివాసంలోకి చొరబడి ఖరీదైన మ్యూజిక్ సిస్టమ్, ఐపాడ్ దోచుకెళ్లారు. పోలీసులు ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్ర ఇంట్లో లేరు.

    శిల్పాశెట్టి ఇంటి మేనేజర్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 16న జుహు పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, ఈ కేసు విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు జుహు పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన పోలీసు అధికారులు వెల్లడించారు.

    ప్రస్తుతం శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా తమ కొత్త సినిమా ప్రాజెక్టు 'దిశ్‌‌కియోంకా' పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని వారు తమ సొంత బ్యానర్ అయిన ఎస్సెన్సియల్ స్పోర్ట్స్ అండ్ మీడియా ప్రై.లి. బేనర్‌పై నిర్మిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేసారు.

    English summary
    
 Actress Shilpa Shetty and businessman Raj Kundra's Juhu residence was robbed earlier this week, said police officials here. An expensive music system and an iPod were missing from the house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X