Don't Miss!
- News రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే?, బాంబర్ తో అన్ని నెలలు!
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘రోబో’ పాజిటివ్ టాక్ తో మహేష్, జూ ఎన్టీఆర్ లకు టెన్షన్ స్టార్ట్...
రజనీకాంత్ సినిమా'రోబో" కి మొదటి రోజు వచ్చిన, వస్తున్న పాజిటివ్ టాక్, సూపర్ హిట్ రివ్వ్యూస్ చూసి వచ్చే వారం రిలీజ్ పెట్టుకున్న 'ఖలేజా", 'బృందావనం" బయ్యర్లకి గుబులు పట్టుకుంది. డబ్బింగ్ సినిమానే అయినా కానీ 'రోబో" చిత్రానికి మరీ టూమచ్ టాక్ చెబుతూ ఉండడంతో ఇది ఖచ్చితంగా తదుపరి వచ్చే చిత్రాలను ఎఫెక్ట్ చేస్తుందని బయ్యర్స్ టెన్షన్ పడుతున్నారు.
మహేష్ ఖలేజా అక్టోబర్ 7న విడుదలవుతుందని ఇప్పటికే థియేటర్లలో పోస్టర్లు వేసేయడంతో ఇక అనుమానించాల్సిన అవసరమే లేకుండా ఆ రోజు సినిమా రిలీజ్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. అలాగే 14 బృందావనం కూడా రిలీజ్ ఖాయమని అంటున్నారు. ఒక వేళ 'రోబో" ధాటికి బాగా ఎక్కువగా ఉంటే బృందావనం వెనక్కి నెట్టవచ్చు. అయితే ఎన్టీఆర్ పట్టుదలగా ఉన్నాడు కాబట్టి అది జరగదని అంటున్నారు. మరి ఈ రెండు సినిమాలూ వచ్చి రోబోకి షాకిస్తాయో లేక 'రోబో" వల్ల ఆ రెండే షేకవుతాయో అన్నది ఇప్పుడు అంతటా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ టెన్షన్ పోవాలంటే అక్టోబర్ 7 వరకు వెయిట్ చేయక తప్పదు.