Don't Miss!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- News నక్షత్రాన్ని మార్చిన గురువు.. ఈ రాశులకు అదృష్ట యోగం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నా దృష్టిలో సౌందర్య కంటే జయసుధే గొప్ప నటి
నిత్యా మీనన్ ని నేను సౌందర్యతో పోల్చను. జయసుధతో పోలుస్తా ఎందుకంటే..నా దృష్టిలో సౌందర్య కంటే జయసుధ గొప్ప నటి. అవకాశాలు లభించాలే కానీ నిత్య భవిష్యత్తులో గొప్ప నటిగా పేరు తెచ్చుకుంటుందనేది నా నమ్మకం అంటోంది రోహిణి. రీసెంట్ గా ఆమె 'అలా.. మొదలైంది!' చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఆమె ముచ్చటిస్తూ ఇలా స్పందించారు. అలాగే రోహిణి.. డైరెక్షన్ చేయాలనేది ప్రస్తుతం నాకున్న ఆశయం.ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ తీశా.
బాల నటుల మీద ఓ డాక్యుమెంటరీ తీశా. సినిమా కోసం తమిళంలో ఓ స్క్రిప్టు సిద్ధం చేసుకున్నా. ఈ సంవత్సరమే దాన్ని చేయాలనుకుంటున్నా. థ్రిల్లర్. మానవీయ కోణంలో ఉండే కథ. తెలుగులో ఎవరన్నా అవకాశమిస్తే చేస్తా అన్నారు. ఇక నాని, నిత్య మీనన్ జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అందులో ఆమె నాని తల్లి పాత్రను పోషించింది.ఈ చిత్రం ద్వారా బి.వి. నందినిరెడ్డి దర్శకురాలిగా పరిచయమయ్యింది.