Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రోహిత్ సంధిస్తున్న 'బాణం' నేడే
మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు తమ్మడు నారా రామ్మూర్తి నాయుడి తనయుడు నారా రోహిత్ 'బాణం' చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమౌతున్న సంగతి తెలిసిందే. అశ్వనీదత్ కుమార్తెలు నిర్మాణం చేతబట్టి 'త్రీ ఎంజెల్స్' పతాకం పై రూపొందిస్తున్న మొదటి చిత్రం ఇది. నూతన దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. రోహిత్ సరసన 'ముని' ఫేం వేదిక కథానాయికగా నటించింది. కాగా ఈ చిత్రం ఈ రోజు(సెపెంబరు 16) విడుదలవుతోంది.
నారా వారి కుటుంబం నుండీ పరిచయమౌతున్న తొలి నటుడు రోహిత్ ను చూసి చంద్రబాబు నాయిడు పరమానందపడిపోతున్నాడు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్రం గురించి మాట్లాడిన చంద్రబాబు "ఈ చిత్రం మంచి సందేశంతో కూడిన వినోదాత్మక చిత్రమని" చెప్పారు. వెంకటేశ్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి నటులు పరిచయమైన అశ్వనీదత్ సమర్పణలో రోహిత్ పరిచయమవడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనం కూడా ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ రోహిత్....