Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
రోజా డైమండ్ జ్యూయలరీ దొంగతనం
నటి మరియు రాజకీయనాయకురాలైన రోజా రీసెంట్ గా లక్షల విలువ చేసే ఆమె డైమండ్ జ్యూయలరీని పొగొట్టుకున్నారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వచ్చే ప్రయాణంలో ఇవి మిస్సైనట్లు ఆమె గుర్తించారు. ఆమె విజయవాడలో ఓ మీటింగ్ లో పాల్గొని సికింద్రాబాద్ వస్తూండుగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణంలో ఆమె తన చెవులుకు ఉన్న డైమండ్ ఇయిర్ రింగ్స్,నెక్లెస్ తీసి హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని నిద్రపోయారు. తెల్లారి చూసేసరికి బ్యాగ్ లో ఆ నగలు లేవు. అయితే ఆమె హైదరాబాద్ లో తన ఇంటికి చేరుకునేదాకా ఆ నగలు దొంగతనం జరిగినట్లు గమనించలేదు. వెంటనే ఆమె దగ్గరలో ఉన్న సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై కంప్లైంట్ చేసారు.
పోలీసులు ప్రస్తుతం ఇన్విస్టిగేట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చిన రోజా మళ్లీ సెకండ్ ఎంట్రీ ప్రారంభించి నెగిటివ్ పాత్రలు,తల్లి పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామె ఓ తమిళ చిత్రంలో ఐటం సాంగ్ చేయనుంది. వెట్టైవాడు టైటిల్ తో రూపొందే ఆ చిత్రంలో ఆమె నటుడు ఫాండ్యరాజన్ తో కలిసి డాన్స్ చేస్తోంది. విజయ్ బాలన్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అంతా కొత్త నటీనటులను పరిచయం చేస్తూ రూపొందిస్తున్నారు. ఇక రోజా రీసెంట్ గా శ్రీరామరాజ్యం చిత్రంలో భూదేవి గా నటించింది. అలాగే మొగుడు చిత్రంలో తాప్సీకి తల్లిగా, గోపీచంద్ కి అత్తగా,ఓ మినిస్టర్ గా సమర్ధవంతంగా నటించి శభాష్ అనిపించుకుంది.