Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రోజా డైమండ్ జ్యూయలరీ దొంగతనం
నటి మరియు రాజకీయనాయకురాలైన రోజా రీసెంట్ గా లక్షల విలువ చేసే ఆమె డైమండ్ జ్యూయలరీని పొగొట్టుకున్నారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వచ్చే ప్రయాణంలో ఇవి మిస్సైనట్లు ఆమె గుర్తించారు. ఆమె విజయవాడలో ఓ మీటింగ్ లో పాల్గొని సికింద్రాబాద్ వస్తూండుగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణంలో ఆమె తన చెవులుకు ఉన్న డైమండ్ ఇయిర్ రింగ్స్,నెక్లెస్ తీసి హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని నిద్రపోయారు. తెల్లారి చూసేసరికి బ్యాగ్ లో ఆ నగలు లేవు. అయితే ఆమె హైదరాబాద్ లో తన ఇంటికి చేరుకునేదాకా ఆ నగలు దొంగతనం జరిగినట్లు గమనించలేదు. వెంటనే ఆమె దగ్గరలో ఉన్న సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై కంప్లైంట్ చేసారు.
పోలీసులు ప్రస్తుతం ఇన్విస్టిగేట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చిన రోజా మళ్లీ సెకండ్ ఎంట్రీ ప్రారంభించి నెగిటివ్ పాత్రలు,తల్లి పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామె ఓ తమిళ చిత్రంలో ఐటం సాంగ్ చేయనుంది. వెట్టైవాడు టైటిల్ తో రూపొందే ఆ చిత్రంలో ఆమె నటుడు ఫాండ్యరాజన్ తో కలిసి డాన్స్ చేస్తోంది. విజయ్ బాలన్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అంతా కొత్త నటీనటులను పరిచయం చేస్తూ రూపొందిస్తున్నారు. ఇక రోజా రీసెంట్ గా శ్రీరామరాజ్యం చిత్రంలో భూదేవి గా నటించింది. అలాగే మొగుడు చిత్రంలో తాప్సీకి తల్లిగా, గోపీచంద్ కి అత్తగా,ఓ మినిస్టర్ గా సమర్ధవంతంగా నటించి శభాష్ అనిపించుకుంది.