Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులని టార్గెట్ చేయడం ఏంటి.. ఊరుకునేది లేదు, రోజా వార్నింగ్!
వైసిపి ఎమ్మెల్యే రోజా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె పలు విషయాలపై మాట్లాడుతూ టాలీవుడ్ లో రగులుతున్న కాస్టింగ్ కౌచ్ వివాదంపై స్పందించారు. పీఆర్పీ టైంలో చిరంజీవితో విభేదిస్తూ రాజకీయంగా మాట్లాడం. ఇప్పుడు జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ రాజకీయ పరమైన తప్పుల గురించి కూడా మాట్లాడతాం. కానీ కాస్టింగ్ కౌచ్ పేరుతో వారి కుటుంబ సభ్యులని దూషించడం, వ్యక్తి గత విషయాలని టార్గెట్ చేయడం హేయమైన చర్య అని రోజా అన్నారు.
చంద్రబాబు మీడియా ఛానళ్లలో కూర్చుని డిబేట్లు చేస్తూ ఇండస్ట్రీని పరువుతీస్తుంటే ఊరుకునేది లేదని రోజా హెచ్చరించారు. బాధ్యతగల ఎమ్మెల్యే పదవిలో ఉన్న బాలకృష్ణ మహిళలపై చేస్తున్న కామెంట్ల గురించి మాత్రం ఎవరూ డిబేట్లు పెట్టారు. ఇక్కడే చంద్రబాబు మీడియా పరిస్థితి అర్థం అవుతుందంటూ రోజా ఎద్దేవా చేశారు.
కాస్టింగ్ కౌచ్ వలన ఇబ్బందులు ఎదుర్కొన మహిళలు తనతో కానీ, ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ ఆర్టిస్టులతో చర్చిస్తే పోరాటానికి సహకరిస్తామని అన్నారు. అలా కాకుండా మీడియా ఛానల్స్ లోకి వెళ్లి డిబేట్లు పెట్టడం వలన ఉపయోగం లేదని అన్నారు.