twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తీవ్రంగా గాయపడ్డ "జబర్దస్థ్" రోజా పాదాలు: చికిత్స ఫొటోలు విడుదల

    |

    Recommended Video

    తీవ్రంగా గాయపడ్డ 'జబర్దస్థ్' రోజా

    గాలేరు-నగరి ప్రాజెక్టు పనులను సత్వరమే ప్రభుత్వం పూర్తి చేయాలన్న డిమాండ్‌తో వైసీపీ ఎమ్మెల్యే రోజా మంగళవారం పాదయాత్ర ప్రారంభించారు. సత్రవాడ నుంచి భారీ ర్యాలీతో ఈ నాలుగు రోజుల యాత్ర ప్రారంభమైంది. నగరి సభలో రోజా మాట్లాడుతూ 14 మండలాలకు సంబంధించి తాగు, సాగునీరు అందించాలనే లక్ష్యంతో గాలేరు-నగరి ప్రాజెక్టుకు వైఎస్‌ శంకుస్థాపన చేశారని, అది పూర్తయితే ఆయన్ను ప్రజలు గుర్తుంచుకుంటారన్న దురుద్దేశంతో టీడీపీ ఆ పనులను పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు.

    వైకాపా ఎమ్మెల్యే రోజా

    వైకాపా ఎమ్మెల్యే రోజా

    పాదయాత్ర చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే, మహిళా నేత రోజా పాదాలకు బొబ్బలెక్కాయి. గత మూడు రోజులుగా ఆమె నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అలవాటు లేని నడకవల్ల పాపం రోజా చాలా ఇబ్బందినే ఎదుర్కొంటోంది.

    ఫేస్ బుక్ ఖాతాలో

    ఫేస్ బుక్ ఖాతాలో

    బొబ్బలెక్కిన తన పాదాలకు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న దృశ్యాలను రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో ఉంచారు. రోజా పాదయాత్ర చేయటం మీద సెటైర్లు వేసిన వాళ్ళు కూదా జాలిపడాలనో ఏమో గానీ పాపం బొబ్బలెక్కిన పాదాలని ఫేస్ బుక్ లో పెట్టారు.

     ప్రజల కోసం

    ప్రజల కోసం

    రోజా పెట్టిన ఈ పోస్టు వైరల్ కాగా, పలువురు ఆమెకు సంఘీభావం తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రజల కోసం నడుస్తున్నారు కాబట్టి భగవంతుడు అండగా ఉంటాడని, యాత్ర కొనసాగించాలని సూచిస్తున్నారు.

    ఎమ్మెల్యేగా కూడా

    ఎమ్మెల్యేగా కూడా

    మొత్తానికి ఒక నటిగానే కాదు ఎమ్మెల్యేగా కూడా రోజా పూర్తి సిన్సియర్ గా ఉంటారన్నమాట. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలతో రోజా మీద సానుభూతి మాత్రం బాగానే పెరిగింది.

    English summary
    Tollywood Actress, Nagari MLA Roja got Hurted while doing Padayatra
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X