Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తీవ్రంగా గాయపడ్డ "జబర్దస్థ్" రోజా పాదాలు: చికిత్స ఫొటోలు విడుదల
Recommended Video
గాలేరు-నగరి ప్రాజెక్టు పనులను సత్వరమే ప్రభుత్వం పూర్తి చేయాలన్న డిమాండ్తో వైసీపీ ఎమ్మెల్యే రోజా మంగళవారం పాదయాత్ర ప్రారంభించారు. సత్రవాడ నుంచి భారీ ర్యాలీతో ఈ నాలుగు రోజుల యాత్ర ప్రారంభమైంది. నగరి సభలో రోజా మాట్లాడుతూ 14 మండలాలకు సంబంధించి తాగు, సాగునీరు అందించాలనే లక్ష్యంతో గాలేరు-నగరి ప్రాజెక్టుకు వైఎస్ శంకుస్థాపన చేశారని, అది పూర్తయితే ఆయన్ను ప్రజలు గుర్తుంచుకుంటారన్న దురుద్దేశంతో టీడీపీ ఆ పనులను పెండింగ్లో పెట్టిందని ఆరోపించారు.
వైకాపా ఎమ్మెల్యే రోజా
పాదయాత్ర చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే, మహిళా నేత రోజా పాదాలకు బొబ్బలెక్కాయి. గత మూడు రోజులుగా ఆమె నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అలవాటు లేని నడకవల్ల పాపం రోజా చాలా ఇబ్బందినే ఎదుర్కొంటోంది.
ఫేస్ బుక్ ఖాతాలో
బొబ్బలెక్కిన తన పాదాలకు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న దృశ్యాలను రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో ఉంచారు. రోజా పాదయాత్ర చేయటం మీద సెటైర్లు వేసిన వాళ్ళు కూదా జాలిపడాలనో ఏమో గానీ పాపం బొబ్బలెక్కిన పాదాలని ఫేస్ బుక్ లో పెట్టారు.
ప్రజల కోసం
రోజా పెట్టిన ఈ పోస్టు వైరల్ కాగా, పలువురు ఆమెకు సంఘీభావం తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రజల కోసం నడుస్తున్నారు కాబట్టి భగవంతుడు అండగా ఉంటాడని, యాత్ర కొనసాగించాలని సూచిస్తున్నారు.
ఎమ్మెల్యేగా కూడా
మొత్తానికి ఒక నటిగానే కాదు ఎమ్మెల్యేగా కూడా రోజా పూర్తి సిన్సియర్ గా ఉంటారన్నమాట. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలతో రోజా మీద సానుభూతి మాత్రం బాగానే పెరిగింది.