బికినీలో సెక్సీగా ‘రొమాన్స్’ హీరోయిన్ (ఫోటోలు)
హైదరాబాద్ : ఇటీవల విడుదలైన 'రొమాన్స్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భామ డింపుల్ చోపడే. రొమాన్స్ సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో సినిమాపై అంచనాలు పెంచేందుకా..? అన్నట్లు ఆమె బికిని హాట్ ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
పూణెకు చెందిన డింపుల్ మొడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టింది. కన్నడ చిత్రం 'సిహి ముత్తు' ద్వారా తెరంగ్రేటం చేసిన డింపుల్....తెలుగులో 'రొమాన్స్' చిత్రం ద్వారా టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమాలో డింపుల్ గ్లామర్ పరంగా బాగానే ఆకట్టుకుంది.
త్వరలో సందీప్ కిషన్ సరసన మరో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది డింపుల్. స్లైడ్ షోలో డింపుల్ బికినీ హాట్ ఫోటులు, రొమాన్స్ చిత్రానికి సంబంధించిన వివరాలు.

ప్రిన్స్, డింపుల్
రొమాన్స్ మూవీ స్టోరీలైన్ విషయానికొస్తే ...ప్రిన్స్ తను ప్రేమించి, జీవితం పంచుకునే అమ్మాయి ఫెరఫెక్ట్ గా ఉండాలనేది కోరిక. అందుకోసం ఓ అమ్మాయిని ప్రేమించి తర్వాత ఫెరఫెక్ట్ అవునా కాదా అన్నది టెస్ట్ పెట్టి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగా అతనికి డింపుల్ పరిచయమవుతుంది. ప్రిన్స్ తనకు శీలానికి టెస్టు పెట్టాడని తెలిసి ఛీ కొడుతుంది.

డింపుల్
ఈ చిత్రంతో తెరకు పరిచయమయిన కథానాయిక డింపుల్ అందంగానూ అభినయపరంగా కూడా బాగుంది. మారుతీ మార్క్ ఉన్న పాత్ర లో పరవాలేదు అనిపించేసింది. హీరోతో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

రొమాన్స్ చిత్రంపై ఆందోళన
రొమాన్స్ చిత్రంలో అశ్లీలమైన భాష వాడారని, అసభ్య సంభాషణలను తొలగించకపోతే వూరుకునేది లేదని పలువురు ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డీవైఎఫ్ఐ నేతలు ఆర్టీసీ క్రాస్రోడ్డులో ఈ సినిమా ఆడుతున్న థియేటర్ వద్ద సినిమా ఫ్లెక్సీలను, పోస్టర్లను తొలగించి దగ్ధం చేశారు.

యువతపై చెడు ప్రభావం
యువతరాన్ని పక్కదారిపట్టించే విధంగా 'రొమాన్స్' సినిమాలో ద్వంద్వార్థాలతో కూడిన పదజాలాన్ని ఉపయోగించారని, టైటిల్లోనే అశ్లీలత ఉందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు టి.జ్యోతి విమర్శించారు.

రొమాన్స్ దర్శక, నిర్మాతలు
‘రొమాన్స్' చిత్రాన్ని ఈ రోజుల్లో టీం రూపొందించారు. ‘ఎవ్రీబడి నీడ్స్' అనేది ఉపశీర్షిక. ప్రిన్స్ హీరో. డింపుల్, మానస హీరోయిన్స్. ‘డార్లింగ్' స్వామి దర్శకుడు. మారుతి సమర్పణలో గుడ్ సినిమా గ్రూప్-మారుతి మీడియా హౌస్ సంయుక్తంగా నిర్మించాయి. జి.శ్రీనివాసరావు-ఎస్.కె.ఎన్ నిర్మాతలు.

రొమాన్స్ కలెక్షన్స్
చిత్రం మరీ నాశిరకంగా ఉండటంతో మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపినింగ్స్ తెచ్చుకోకపోయినా వీకెండ్ లో కలెక్షన్స్ బాగానే సంపాదించింది. నైజాం రైట్స్ ని రవితేజ తో కృష్ణ చిత్రం తీసిన కాశి విశ్వనాధం ...ఎనభై లక్షలు చెల్లించి తీసుకున్నారు. ఆయన ఈ చిత్రం కలెక్షన్స్ తో చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలియచేసారు.

ఇతర ఏరియాల్లో
మిగతా ఏరియాల్లో ఎక్కడా చెప్పుకోతగ్గ కలెక్షన్స్ ఈ చిత్రానికి లేవని తెలుస్తోంది. బంద్ ప్రభావం కూడా ఈ చిత్రం కలెక్షన్స్ డ్రాప్ కు కారణమని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు.

విషయం లేదు
అయితే సినిమాలో విషయం లేకపోవటమే ఎవరినీ ఎట్రాక్ట్ చేయకపోవటానికి కారణమని ఇండస్ట్రీ పీపుల్ అంటున్నారు. ఇక ఈ చిత్రం రెండు కోట్ల బడ్జెట్ లో నిర్మితమైంది.

మారుతి బ్రాండ్
హైదరాబాద్ లోనే 54 థియోటర్స్ లో ఈ చిత్రం భారిగా విడుదలైంది. అలాగే...ఈ చిత్రానికి మారుతి చాలా ఎగ్రిసివ్ గా ప్రమేషన్ చేసారు.


Click it and Unblock the Notifications











