Don't Miss!
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిరంజీవి ఫ్యాన్ నంటున్న ముఖ్యమంత్రి రోశయ్య
''ఈ కేరింతలు, ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ నాది ఆ వయసు కాదు. పవన్కల్యాణ్ సినిమాలు మొత్తంగా ఎప్పుడూ చూడలేదు గానీ..అప్పుడప్పుడూ కొన్ని కొన్ని సన్నివేశాలు చూసే అవకాశం వచ్చింది. మంచి నటుడు. నాగబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ అన్నయ్య చిరంజీవి బాటలో నడుస్తున్నారు. మీలాగే నేను కూడా చిరంజీవి అభిమానిని" అన్నారు ముఖ్యమంత్రి కె.రోశయ్య. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం 'కొమరం పులి' ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన ఆ విధంగా అన్నారు. కొమరం పులి తొలి సీడీని రెహమాన్ తల్లి కరీమా బేగం ఆవిష్కరించారు. రోశయ్య అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ "తింటేగానీ రుచి తెలియదు అంటారు. కానీ పాటలు విని సినిమా ఎలా ఉంటుందో చెప్పొచ్చు. భారతదేశం గర్వించే సంగీత దర్శకుడు రెహమాన్. ఆయన మంచి పాటలు ఇచ్చారని ఆశిస్తున్నా. నాకు సినిమాల గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ 'కొమరం పులి' తప్పకుండా చూస్తా" అన్నారు. దర్శకుడు సినిమా గురించి చెబుతూ "ఈ కథ ఎక్కడ్నుంచో పుట్టలేదు. పవన్ వ్యక్తిత్వం నుంచి పుట్టింది. జనం కోసం ఏదైనా చేయాలి అని ఆలోచించే వ్యక్తిత్వం ఆయనది. సినిమాలో అదే కనిపిస్తుంద"న్నారు. "సినిమా మీద ప్రేమతో ఈ రంగంలోకి వచ్చాను. ఆ ప్రేమే ఇంత పెద్ద సినిమా తీయడానికి కారణమైంద"న్నారు నిర్మాత. రెహమాన్ మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో తీసిన చిత్రమిది. సంగీతం తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.