Don't Miss!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- News ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మోహన్ బాబు 'రౌడీ' విడుదల తేదీ మారింది
హైదరాబాద్ : మంచు మోహన్బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రౌడీ'. విష్ణు, శాన్వి జంటగా నటించారు. రామ్గోపాల్వర్మ దర్శకత్వం వహించారు. పార్థసారధి, గజేంద్ర, విజయ్కుమార్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దాన్ని ఏప్రియల్ 4 తేదీకి మార్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని మంచు విష్ణు ఖరారు చేసారు. చిత్రం చేస్తున్నంతసేపూ చాలా ఎంజాయ్ చేసానని,చాలా ఎక్సైటింగ్ గా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. అలాగే చిత్రం ఖచ్చితంగా హిట్ అవతుందని నమ్మకం వ్యక్తం చేసారు. అతి త్వరలో ఆడియో లాంచ్ కానుంది.
మోహన్ బాబు మాట్లాడుతూ... ఖద్దరు కట్టిన ప్రతి ఒక్కడూ మహాత్ముడు కాడు. అలానే.. ఆయుధం పట్టిన ప్రతి ఒక్కడూ రౌడీ కాదు. హింసకు కొన్నిసార్లు హింసతోనే సమాధానం చెప్పవలసి వచ్చిప్పుడు, మంచితనం చేతకానితనంగా మిగిలిపోతున్నప్పుడు ఆయుధం పట్టాల్సిందే. మరి.. 'రౌడీ'లో ఎవరు, ఎందుకు ఆయుధం పట్టారో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు
అలాగే ... రామ్గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ని ఇంతదాకా నేను చూడలేదు. డైరెక్షన్ తప్ప అతనికి వేరే ధ్యాసే ఉండదు. విష్ణు కెరీర్లో బెస్ట్ సినిమాగా ఇస్తానని చెప్పాడు. ఈ చిత్రంలో నేను, విష్ణు తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాం. నేను, వర్మ కలిసి చేస్తున్నామంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోందని మాకు తెలుసు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా సినిమా చేసుకుంటూ వెళ్తున్నాం అన్నారు.
మంచు విష్ణు మాట్లాడుతూ... ''వర్మ శైలి ఏమిటో ఈ చిత్రంతో మరోసారి తెలుస్తుంది. ప్రతీ సన్నివేశం షాక్కి గురిచేస్తుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి విశేష స్పందన వస్తోంది. తప్పకుండా వర్మ మార్క్ ఏమిటో చూపించే చిత్రం అవుతుంది'' అన్నారు.
ఏవి పిక్చర్స్ బేనర్లో పార్థ సారథి, గజేంద్ర, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఎమోషన్ సీన్లతో పాటు హై ఓల్టేజ్ సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. సినిమాలో మోహన్ బాబు పెద్ద కుమారుడుగా కన్నడ కిషోర్, రెండవ కుమారుడుగా మంచు విష్ణు నటిస్తున్నట్లు సమాచారం. వర్మ కు అత్యంత ఇష్టమైన గాడ్ ఫాధర్ పోలికలతోనే ఈ చిత్రం తెరకెక్కుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
మరో ప్రక్క మంచు కుటుంబంతో వరుసగా రెండో చిత్రం చేయడానికి రామ్గోపాల్ వర్మ సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు విష్ణు కోసం మరో కథ సిద్ధం చేసుకొంటున్నారు. ఇదో థ్రిల్లర్ తరహా చిత్రమట. ఇందులో విష్ణు ఓ పోలీస్ అధికారిగా కనిపిస్తారని సమాచారం. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. 'రౌడీ' విడుదలైన తరవాత ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి 'టెన్షన్ టెన్షన్' అనే పేరు పరిశీలిస్తున్నారు. సాంకేతిక వర్గం, ఇతర నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.