Don't Miss!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సిరివెన్నెలకు అన్యాయం: ప్రశ్నించిన ఆర్పీ పట్నాయక్
ప్రభుత్వాలు సిరివెన్నెల సీతారామ శాస్త్రిని గుర్తించడం తనను తీవ్ర నిరాశకకు గురి చేసిందని ఆర్పీ పట్నాయక్ సోషల్ మీడియా ద్వారా వాపోయారు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఈ సారి కూడా ప్రముఖ తెలుగు రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి మొండి చేయి లభించడంతో సంగీత దర్శకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్ నిరసన వ్యక్తం చేసారు.
దశాబ్దాలుగా తెలుగు సినిమాకు సాహిత్య సేవ చేస్తున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి పద్మ అవార్డుల విషయంలో అన్యాయం జరుగుతోందని, ఆయన్ను ప్రభుత్వాలు గుర్తించక పోవడం తనను తీవ్ర నిరాశకకు గురి చేసిందని ఆర్పీ పట్నాయక్ సోషల్ మీడియా ద్వారా వాపోయారు.
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు (తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్) ఇలా ఎందుకు చేస్తున్నాయో అర్థం కావడం లేదు, కనీసం సిరివెన్నెల సీతారామశాస్త్రి పేరును కూడా పద్మ అవార్డులకు ప్రతిపాదించలేదు. నన్ను టోటల్ గా డిసప్పాయింట్ చేసింది. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు వినిపించే వరకు గొంతు కలుపుదాం. నా వాదన రైట్ అనిపిస్తే మీడియా వారు కూడా మాతో జాయిన్ అవ్వండి అంటూ' అని తెలిపారు.