Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాజమౌళి తల్లి మరణం గురించి తెలిస్తే కంటతడి పెట్టాల్సిందే.. గుండె ముక్కలయ్యేలా విజయేంద్ర ప్రసాద్...
దేశ సినీ పరిశ్రమ గర్విందచదగిన రచయిత, కథకుడు కేవీ విజయేంద్ర ప్రసాద్ గురించి తెలియని వారుండరు. తన కుమారుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి బాహుబలి చిత్రంతో ఆయన సృష్టించిన విజయ సునామీ గురించి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. RRR చిత్రంతో కొత్త చరిత్రను రాయడానికి సిద్దమైన విజయేంద్రప్రసాద్ తన వ్యకిగత, కుటుంబ విషయాలను నటుడు అలీతో పంచుకొంటూ..
నాది ప్రేమ వివాహం అంటూ
విజయేంద్రప్రసాద్ తన వ్యక్తిగత, వైవాహిక జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనది ప్రేమ వివాహమని, వైజాగ్లో ఉన్నప్పుడు పరిచయం అయ్యారు. వాళ్లు బర్మా నుంచి వచ్చిన కాందిశీకులు. మేం వైజాగ్ నుంచి హంపీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు స్టేషన్లో మా కుటుంబానికి, అన్నయ్యకు పరిచయం చేశాను. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిపై ఇష్టాన్ని ఫ్యామిలీకి చెబితే తనను హంపి ప్రాంతానికి రప్పించారు. అలానే ఆమె మాతో ఉండిపోయారు అని చెప్పారు.
నా భార్య కులం ఏమిటంటే..
భార్యతో తన అనుబంధాన్ని చెప్పుతూ.. ఎవరైనా తన భార్యను ప్రపంచంలో నీ కంటే అందగత్తె ఎవరు లేరు అని పొగిడితే చాలూ.. వారి సంసారం ఎక్కువ కాలం సాగుతుందని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మేము కమ్మ కులానికి చెందిన వాళ్లం. పెళ్లి జరిగిన చాలా రోజుల తర్వాత గానీ ఆమె కులం ఏమిటో తెలియలేదు. ఆమె కులం గురించి ఎప్పుడూ అడగలేదు. ఒకరోజు చిరంజీవిని చూసి మావాడు అంటే.. ఏమిటని అడిగితే మాది కాపు కులం అని చెప్పారనే విషయాన్ని అలీతో పంచుకొన్నారు.
స్ట్రోక్తో కోమాలోకి వెళ్లారు అంటూ
తన భార్య అనారోగ్యం గురించి చెబుతూ.. మా జీవితం ఆనందంగా సాగుతున్న సమయంలో ఆమెకు స్ట్రోక్ వచ్చింది. దాంతో నా భార్య కోమాలోకి వెళ్లిపోయింది. సుమారు ఆరు నెలలు కోమాలోనే ఉండిపోయారు. ఆమె కోసం ఓ గదిని హాస్పిటల్గా మార్చాం. అయితే ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు అంటూ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఆ నరకం వద్దని దేవుడిని వేడుకొన్నా
తన భార్య కోమాలో ఉన్నప్పటికీ మా మాటలకు స్పందించేది. ఆమె కోమా నుంచి బయటపడే అవకాశం ఉందని డాక్లర్లు చెప్పారు. కానీ కోమా నుంచి బయటకు వచ్చినా ఆమె శరీరం చచ్చుబడి ఉంటుంది. జీవితాంతం ఆమె అలానే ఉండిపోవాల్సి వస్తుందని చెప్పారు. ఆ సమయంలో దేవుడిని ఒక్కటే కోరుకొన్నాను. ఇస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి లేదంటే.. మీరే ఈ లోకం నుంచి ఆమెను తీసుకెళ్లండి అని కోరుకొన్నాను. ఆ నరకం వద్దని దేవుడికి దండం పెట్టుకొన్నాను అని విజయేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video
బాహుబలి సక్సెస్ చూసి ఉంటే బాగుండని
నా కెరీర్లో ఉన్నతిని నా భార్య దగ్గరగా చూశారు నా కుమారుడు సక్సెస్ను కూడా దాదాపు చూశారు. బాహుబలి సక్సెస్ను చూసి ఉంటే బాగుండేదని చాలా సార్లు అనుకొన్నాను. చాలాసార్లు ఆమెను తలచుకొని కన్నీళ్లు పెట్టుకొన్నాను. ఆమె చూస్తే బాగుండేని పదే పదే అనిపిస్తుంటుంది. ఆమె ఎక్కడ ఉన్నా మా సక్సెస్ను చూస్తూనే ఉంటారు అని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.