Don't Miss!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- News వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దికి సతీమణి షాక్ - రెబల్ గా బరిలోకి..!!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఎన్టీఆర్ కోపం నశాలానికి ఎక్కిన మూమెంట్, అణుచుకుని హుందాగా...
'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రెస్ మీట్ గ్రాండ్గా జరింది. ఈ సినిమాపై నెలకొన్న అనుమానాలను, సందేహాలను రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మీడియా వారు అడిగిన కొన్ని ప్రశ్నలు 'ఆర్ఆర్ఆర్' టీంను ఆశ్చర్యానికి గురి చేయగా, మరికొన్ని కడుపుబ్బా నవ్వించాయి. అయితే ఒకే ఒక ప్రశ్న మాత్రం వారిని ఆగ్రహానికి గురి చేసినట్లు తెలుస్తోంది.
ఆ ప్రశ్న తాలూకు ఆగ్రహం రాజమౌళి, రామ్ చరణ్లో అంతగా కనిపించక పోయి.... ఎన్టీఆర్ మాత్రం తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పోయారు. హుందాగా స్పందిస్తూనే గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తారక్ ఆగ్రహానికి గురికావడానికి కారణం ఏమిటో ఓ లుక్కేద్దాం.
ఇంతకీ ఏమిటా ప్రశ్న? అందులో ఏ ముంది?
కొమురం భీం ముస్లిం పాలనలో ఉండేవారు.. అల్లూరి సీతా రామరాజు క్రిస్టియన్స్ అయిన బ్రిటిషర్స్ పాలనలో ఉండేవారు. ఈ ఇద్దరూ కూడా బయటి నుంచి వచ్చిన వారే.. వీరేమో హిందువులు. మీరు స్టోరీ అనుకున్నపుడు అలాంటి ఆలోచన మీకు ఉండక పోవచ్చు. కానీ రేపు సినిమా ప్రజల్లోకి వచ్చినపుడు ఎవరైనా దీన్ని ఆ కోణంలో చూసి వివాదం చేస్తే? పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్న ఎదురైంది.
కూల్గా రియాక్ట్ అయిన రాజమౌళి
ఏం అడుగుతున్నారు సార్... ఎక్కడి నుంచి ఎక్కడికైనా లింక్ వేయవచ్చా? సరే మీరు చెప్పినట్లే వివాదం వచ్చిందే అనుకోండి... వివాదం ఉందని సినిమా తీయడం మానేయాలా? ఇలాంటివి వస్తూనే ఉంటాయి. నేనైతే ఇలాంటి వాటి గురించి ఆలోచించను... అంటూ రాజమౌళి కూల్గా రియాక్ట్ అయ్యారు.
కోపాన్ని అణుచుకుని ఎన్టీఆర్ హుందాగా..
అయితే ఈ ప్రశ్న ఎన్టీఆర్కు చాలా కోపం తెప్పించినట్లు ఆయన ఫేర్ రియక్షన్స్ స్పష్టం చేస్తున్నాయి. ‘‘ఇలాంటి ఆలోచనలు మనకు ఉన్నాయి కానీ వారికి లేవు.. మన ఆలోచనలు వారిపై రుద్దేస్తున్నాం'' అంటూ హుందాగా స్పందించారు.
కులం, మతం అంటే తారక్కు చిరాకు..
కులం, మతం లాంటి తేడాలతో మనుషులను, పరిస్థితులను, సినిమాలను బేరీజు వేస్తే ఎన్టీఆర్ చాలా చిరాకు పడతారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అందుకే ఆ ప్రెస్ మీట్లో ఆ ప్రశ్న ఎదురవ్వగానే ఎన్టీఆర్ కోపం అనే తన ఎమోషన్ ఆపుకోలేక పోయారు.