Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
‘సరైనోడు’ స్పెషల్ సాంగు ఖర్చు రూ. కోటిన్నర, కారణం ఇదే!
హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరైనోడు' చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగు కోసం రూ. కోటిన్నర విలువ చేసే సెట్ వేసారు.
‘అల్లు అర్జున్, కేథరిన్ లపై ఈ స్పెషల్ సాంగ్ చిత్రీరిస్తున్నారు. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్ లోని 7 ఎకరాల స్థలంలో రూ. కోటిన్నర ఖర్చు పెట్టి సెట్ వేసారు. ఈ సాంగులో దాదాపు 300 మంది డాన్సర్లు బ్యాగ్రౌండ్లో స్టెప్పులేస్తున్నారు. మరో మూడు రోజుల్లో సాంగ్ చిత్రీకరణ పూర్తి కాబోతోంది' అని యూనిట్ సభ్యులు తెలిపారు.
పాపులర్ బాలీవుడ్ కొరియోగ్రఫీ ద్వయం బాస్కో-కాసెర్ ఆధ్వర్యంలో సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సాంగ్ చిత్రీకరణలో అత్యంత ఖరీదైన లాంబోర్గినీ కార్లను కూడుతున్నారు. ఇందుకోసం వాటిని ప్రత్యేకంగా రెంటుకు తెప్పించారు. సాంగ్ చాలా బాగా వస్తోందని, సినిమాలో ఇది హైలెట్ అవుతుందని అంటున్నారు.
బన్నీ సొంత బేనర్లో... ఆయన తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ జన్మదినం సందర్భగా ఏప్రిల్ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.