Don't Miss!
- News బీఆర్ఎస్కు మరో షాక్: బీజేపీలోకి బేతి సుభాష్ రెడ్డి, ఈటలకు మద్దతు
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అవినీతి కుంభకోణం కేసులో శిల్పాశెట్టి ..కోర్టు నిర్దారణ
కామన్వెల్త్ క్రీడల(సీడబ్ల్యూజీ) నిర్వహణ కమిటీ బహిష్కృత అధ్యక్షుడు సురేశ్ కల్మాడీ, మరో 9 మందిపై కోర్టులో విచారణకు రంగం సిద్ధమైంది. కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో వీరు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గరిష్ఠంగా జీవితఖైదు శిక్షపడే అవకాశం గల కుట్ర, దొంగ సంతకం తదితర ఆరోపణలపై ఢిల్లీ కోర్టు సోమవారం కల్మాడీ, ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యదర్శి లలిత్ భానోత్ సహా 9 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసింది.
నిందితులు ప్రభుత్వానికి రూ.90 కోట్లు నష్టం కలిగించారన్న ఆరోపణలపై భారత శిక్షాస్మృతిననుసరించీ, అవినీతి నిరోధక చట్టం కింద ఈ అభియోగాలు ఉన్నాయి. ఈ నెల 20 నుంచి సాక్ష్యాల నమోదుకు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి రవీంద్ర కౌర్ నిర్ణయించారు. సాక్షుల జాబితాను 7వ తేదీలోగా తమకు సమర్పించాలని సీబీఐని ఆదేశించారు.
ఇవి రుజువైతే గరిష్టంగా జీవితఖైదుపడే అవకాశంఉంది. ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలు నమోదును ఈనెల 20న ప్రారంభిస్తామని ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి రవీందర్ కౌర్ పేర్కొన్నారు. ఈనెల 7లోగా ప్రాసిక్యూషన్ తరఫు సాక్షుల జాబితాను సమర్పించాలని సీబీఐని ఆదేశించారు. అలాగే ఈ కేసు విచారణ సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజువారీ పద్ధతిలో జరుగుతుందని స్పష్టంచేశారు. కల్మాడీతోపాటు క్రీడల నిర్వహణ కమిటీ మాజీ సెక్రటరీ జనరల్ లలిత్ భానోత్, కమిటీ మాజీ డెరైక్టర్ జనరల్ వి.కె.వర్మ, మాజీ జాయింట్ డెరైక్టర్ జనరల్(క్రీడలు) ఏఎస్వీ ప్రసాద్, హైదరాబాద్లోని ఏకేఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రమోటర్ ఏకే రెడ్డి తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఏకేఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోంది.