Don't Miss!
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News పవన్కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
'రుద్రమదేవి' లో నమ్మశక్యం కాని కొత్త ప్రయోగం...పూర్తి డిటేల్స్
హైదరాబాద్ : మారుతున్న ప్రేక్షకులు అభిరుచిని అర్దం చేసుకుని ముందుకు వెళ్లటం మీదే సినిమావాళ్లు దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే సినిమా వాళ్లు కంటే ప్రేక్షకులే చాలా అప్ డేట్ గా ఉంటున్నారు. దానికి తోడు వారు...ప్రపంచ సినిమాను సైతం చూస్తున్నారు. ఈ నేపధ్యంలో వారిని ఆకట్టుకోవాలంటే టెక్నికల్ గా కూడా వండర్ గా కనిపించాలి. అది తమకున్న లిమెటెడ్ బడ్జెట్ లో. ఎందుకంటే వేల కోట్ల పెట్టలేము మన తెలుగు సినిమాలకు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే గుణశేఖర్ తన తాజా చిత్రం 'రుద్రమదేవి' కి కొత్త ప్రయోగంతో ముందుకు వస్తున్నారు. కళ్లద్దాలు లేని త్రీడిలో తమ సినిమాని చూడెపడతాను అంటున్నారు. ఆ ఎక్సపీరియన్స్ పూర్తి డిటేల్స్ ఇక్కడ...
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
సాధారణంగా త్రీడి సినిమాలను చూడడానికి ప్రత్యేక కళ్లజోళ్లను పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే కళ్లజోళ్లు అవసరం లేకుండానే త్రీడీ సినిమా చూడగలిగితే అనే ఆలోచనను నిజం చేయబోతున్నారు. అలాంటి ఎక్సపీరియన్స్ నే 'రుద్రమదేవి' సినిమా ఇవ్వనుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో సరికొత్త సాంకేతిక విధానాన్ని వినియోగించారు దర్శకుడు గుణశేఖర్.
'ఎన్హ్యాన్స్డ్ డెప్త్ సొల్యూషన్' (ఈడీఎస్) అనే విధానం ఉపయోగిస్తున్నారు. అమెరికాకు చెందిన 'యింగ్ గ్రూప్' సంస్థ ఆధ్వర్యంలో జేమ్స్ ఆష్బే, మైల్స్ ఆడమ్స్ బృందం ఈ పనులు నిర్వహిస్తోంది. 'కింగ్ కాంగ్', 'కుంగ్ ఫూ పాండా', 'ఇన్సెప్షన్', 'అవతార్' వంటి చిత్రాలకు త్రీడీ విభాగంలో ఈ సంస్థ పని చేసింది.
గుణశేఖర్ మాట్లాడుతూ ''రుద్రమదేవి'ని టూడీ, త్రీడీ విధానాల్లో తెరకెక్కించారు. అయితే త్రీడీలో సినిమా చూసే అవకాశం అందరికీ ఉండదు. అన్ని ప్రాంతాల్లో థియేటర్లకు త్రీడీ కళ్లద్దాలను అందించలేని పరిస్థితి. అందుకే అందరికీ త్రీడీ అనుభూతి కలిగించాలని యింగ్ గ్రూప్ను సంప్రదించాం. వాళ్లకు త్రీడీ విధానంలో మంచి అవగాహన ఉంది. టూడీ థియేటర్లలోనూ త్రీడీ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగించే ఈడీఎస్ విధానం గురించి చెప్పారు. అలా టూడీలో చిత్రీకరించిన సినిమాను ఈడీఎస్ ద్వారా మార్పు చేశాం'' అని వివరించారు.
ఈడీఎస్ విధానంలో ఫొటో డెప్త్ను పెంచాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి ప్రతి ఫ్రేమ్ మీద రెండు సార్లు పనిచేయాల్సి ఉంటుంది. అయితే డెప్త్ పెంచే క్రమంలో రీల్లోని బొమ్మల రంగులు మారాయి. దాంతో మరింత శ్రద్ధ తీసుకుని ఆ తేడా కనిపించకుండా చేశారు. ఫైట్ సీన్స్ విషయంలో ఈడీఎస్ మార్పు కష్టమైంది. అయినా జాగ్రత్తగా కొనసాగించారు. సుమారు ఎనిమిది నెలలుగా ఈ కార్యక్రమం సాగుతోంది.
ఈడీఎస్ ద్వారా మార్చిన రీల్లో ఇమేజ్ షార్ప్నెస్ కొద్దిగా తగ్గినట్టు అనిపించినా సన్నివేశాలన్నీ సహజంగా కనిపిస్తాయి. మరోవైపు కళ్లజోళ్లు పెట్టుకుని చూసేలా కూడా కొన్ని ప్రింట్లను రూపొందిస్తున్నారు. మొత్తానికి 'రుద్రమదేవి' సినిమాను రెండు విధాలుగా చూడొచ్చన్నమాట.
మరో ప్రక్క ... ఈ చిత్రం నిర్మాతలు...బాహుబలి తరహాలోనే సీరిస్ ఆఫ్ పోస్టర్స్ ని విడుదల చేయటానికి రెడీ అవుతున్నారు. అయితే మరి బాహుబలి కు అంతర్జాతీయ స్ధాయిలో ప్రమోషన్ చేసారు. మరి ఇక్కడ కూడా చేస్తారో లేదో చూడాలి.
అలాగే ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. అయితే విజువల్ ఎఫెక్టు పనుల వల్లే లేటు అని చెప్పుతున్నారు. ఈ నేపధ్యంలో రుద్రమదేవి...ఆగస్టు తర్వాత మాత్రమే రిలీజ్ కు సమయం దొరికేటట్లు ఉంది.
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రుద్రమదేవి'. అల్లు అర్జున్, రానా, కృష్ణంరాజు కీలక పాత్రలు పోషించారు. గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్ త్రీడీ ద్విభాషా చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తుది దశ వీఎఫ్ఎక్స్ పనులు చేపడుతున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.
దర్శకనిర్మాత మాట్లాడుతూ ''ముందు చెప్పినట్టుగా ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేయడం లేదు. సాంకేతికంగా సినిమాని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మరి కొంత సమయం తీసుకుంటున్నాం. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ పనులు దేశవిదేశాల్లో చేపడుతున్నాం. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించేలా ఉంటుంది. రుద్రమదేవిగా అనుష్క, పోరుగడ్డపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ అభినయం ఆకట్టుకుంటుంది'' అన్నారు.
సుమన్, ప్రకాష్రాజ్, నిత్య మేనన్, కేథరిన్, ప్రభ, జయప్రకాష్రెడ్డి, ఆదిత్య మేనన్, అజయ్ తదితరులు నటించారు. చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కళ: తోట తరణి, ఛాయాగ్రహణం: అజయ్ విన్సెంట్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సమర్పణ: రాగిణీగుణ.