గుణశేఖర్ క్షమాపణ: ‘రుద్రమ దేవి’ కొత్త రిలీజ్ డేట్
హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి' సెప్టెంబర్ 4న విడుదల చేస్తున్నట్లు ఆ మధ్య అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గ్రాఫిక్స్ వర్క్ పూర్తిక కాక పోవడంతో సినిమాను అక్టోబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేసారు.
ఈ సందర్బంగా గుణశేఖర్ మాట్లాడుతూ తెలుగు వారందరికీ గర్వకారణమైన రుద్రమదేవి చరిత్రను తెరపై చూడాలని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదల తేదీ మార్చినందుకు వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. 3డి టెక్నాలజీ వర్క్ లో జరుగుతున్న జాప్యం వల్లనే సినిమా విడుదల వాయిదా వేయవలసి వచ్చింది అన్నారు.
ఈ చిత్రంలో అనుష్కతో పాటు అల్లు అర్జున్, రానా, కృష్ణంరాజు, నిత్య మీనన్, కేథరిన్ కీలక పాత్రలు పోషించారు. గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్ త్రీడీ ద్విభాషా చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
దర్శకనిర్మాత గుణ శేఖర్ మాట్లాడుతూ '' ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ పనులు దేశవిదేశాల్లో చేపడుతున్నాం. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించేలా ఉంటుంది. రుద్రమదేవిగా అనుష్క, పోరుగడ్డపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ అభినయం ఆకట్టుకుంటుంది'' అన్నారు.
‘భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి సినిమాగా ఎంతో భారీ వ్యయంతో తయారవుతున్న మా చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన రికార్డింగ్ కూడా పూర్తయింది. హిందీ చిత్రం ‘లగాన్'కు అమితాబ్ బచ్చన్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఎంతటి ఎస్సెట్ అయ్యిందో, మా చిత్రానికి చిరంజీవిగారిచ్చిన వాయిస్ ఓవర్ ఓ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. అడగ్గానే అంగీకరించి వాయిస్ ఓవర్ ఇచ్చిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా'' అని చెప్పారు.

గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రంలో రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాశ్రాజ్, నిత్యా మీనన్, కేథరిన్ ట్రెసా, ప్రభ, జయప్రకాశ్రెడ్డి, ఆదిత్య మీనన్, ప్రసాదాదిత్య, అజయ్, విజయ్కుమార్, వేణుమాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిశోర్, కృష్ణభగవాన్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శివాజీరాజా తారాగణం. ఇళయరాజా సంగీతం సమకూర్చారు.
ఈ చిత్రంలో రాణీ రుద్రమగా..అనుష్క, చాళుక్య వీరభద్రునిగా..రానా, గోనగన్నారెడ్డిగా..అల్లు అర్జున్, గణపతిదేవునిగా..కృష్ణంరాజు, శివదేవయ్యగా..ప్రకాష్ రాజ్, హరిహరదేవునిగా..సుమన్, మురారిదేవునిగా..ఆదిత్యమీనన్, నాగదేవునిగా..బాబా సెహగల్, కన్నాంబికగా..నటాలియాకౌర్, ముమ్మడమ్మగా..‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా..హంసానందిని, అంబదేవునిగా..జయప్రకాష్రెడ్డి, గణపాంబగా..అదితి చంగప్ప, కోటారెడ్డిగా..ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా..అజయ్ కనిపించనున్నారు. వీరితో పాటు నిత్యామీనన్, కేథరిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సీతారామశాస్త్రి, ఛాయాగ్రహణం: అజయ్ విన్సెంట్, కళ: తోట తరణి, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె. రామ్గోపాల్, సమర్పణ: రాగిణీ గుణ, కథ, స్ర్కీన్ప్లే, నిర్మాణం, దర్శకత్వం: గుణశేఖర్.


Click it and Unblock the Notifications











