శేఖర్ కమ్ముల చిత్రాల్లో హీరోయిన్ కి ప్రత్యేకమై క్యారక్టరైజేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన కమిలినీ ముఖర్జీ, తమన్నా, బిందు మాధవిలకు లైఫ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో దగ్గుపాటి రాణా హీరోగా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఆ చిత్రంలో హీరోయిన్ గా తమిళ హీరోయిన్ రుక్మిణిని తీసుకున్నారు. ఆమె ప్రస్తుతం ఆస్కార్ రవిచంద్రన్ రూపొందిస్తున్న ఆనందతాండవం చిత్రంలో సెకెండ్ హీరోయిన్ (మొదటి హీరోయిన్ తమన్నా)గా చేస్తోంది. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ట్రేడ్ లో చాలా అంచనాలే ఉన్నాయి. ఇన్నాళ్ళూ రొమాంటిక్ కామిడీలు తీసిన శేఖర్ కమ్ముల ఈ చిత్రంలో ఫ్యాక్షన్ కుటుంబాలను తనదైన శైలిలో చూపెడుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఏదైమైనా శేఖకర్ కమ్ముల సినిమాలో బుక్కవటంతో రుక్మిణి అదృష్టవంతురాలంటున్నారు.బెస్టాఫ్ లక్ రుక్మిణి.