Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మమ్మల్ని ఎంతో టార్చర్ చేశారు: అమలాపాల్
హీరో ధనుష్ తనకు చాలా మంచి స్నేహితుడని, అతనితో తనకు సంబంధం ఉందంటూ తప్పుడు ప్రచారం చేశారని నటి అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేసింది అమలాపాల్
మాలీవుడ్ ముద్దుగుమ్మ అమలాపాల్ తమిళంలో జోరు కొనసాగిస్తుంది. ప్రస్తుతం వీఐపీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న వీఐపీ 2 చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.
హీరో ధనుష్ తనకు చాలా మంచి స్నేహితుడని, అతనితో తనకు సంబంధం ఉందంటూ తప్పుడు ప్రచారం చేశారని నటి అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేసింది. లేనిపోని వదంతులతో తనను, ధనుష్ ను టార్చర్ చేశారని తెలిపింది. ధనుష్ తో నటిస్తే తనకు మంచి అనుభవం వస్తుందని, ఆయన చాలా హార్డ్ వర్కర్ అని చెప్పింది. నటనలో ధనష్ తో తనకు మంచి పోటీ ఉంటుందని తెలిపింది.
నిజంలేని ప్రచారానికి నిలకడ ఉండదు. ఎంత వేగంగా వచ్చాయే అంతగా గాలిలో కలిసి పోతాయి. నిజం చెప్పాలంటే గాయనీ సుచిత్ర నాకు మంచి స్నేహితురాలు. తను నేను కలిసి యోగా చేశాం. సుచిత్ర భర్త కార్తీక్కుమార్తో కలిసి నేను దైవతిరుమగళ్ చిత్రంలో నటించాను.అలాంటి అనూహ్యంగా నాపై వదంతులు ప్రచారం అయ్యాయి.
ఆరా తీస్తే సుచీ లీక్స్ విషయంలో సుచిత్రకు సంబంధం లేదని తెలిసింది. ఎవరో ఆమె పేరును మిస్ యూజ్ చేశారు. ఈ విషయంలో నన్ను,నటుడు ధనుష్ను చాలా టార్చర్కు గురి చేశారు. మా గురించి ఏదో వీడియో వస్తుందని అన్నారు. అది ఇంకా ప్రసారం కాలేదని చాలా బాధగా ఉంది. అంటూ చెప్పింది.