Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
కొందరి వల్ల ‘ఆర్ఎక్స్ 100’ వేలం డిస్ట్రబ్ అయింది: కార్తికేయ
కార్తికేయ, పాయల్ రాజ్పుత్ హీరో హీరోయిన్లుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఎక్స్ 100' మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో వాడిన ఆర్ఎక్స్ 100 బైక్ కేరళ వరద బాధితులకు సహాయం చేయడం కోసం వేలం వేస్తున్నట్లు హీరో కార్తికేయ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.
కనీస ధర రూ. 50 వేలుగా నిర్ణయించి బైక్ వేలం వేయగా కొందరు బిడ్డింగ్ చేశారు. అయితే చాలా మంది ఫేక్ బిడ్డింగ్ వేసి వేలాన్ని డిస్ట్రబ్ చేశారని, దీంతో బైక్ మా దగ్గరే ఉండిపోయిందని, తమ సొంత డబ్బును కేరళ వరద బాధితుల కోసం విరాళంగా ఇచ్చినట్లు కార్తికేయ తెలిపారు.
Lets make it huge guys.. #keralafloods pic.twitter.com/vyfSA7mU2x
— Kartikeya (@ActorKartikeya) September 5, 2018
మళ్లీ బైక్ వేలం వేసే సమయం కూడా లేదు. ఎవరైతే జెన్యూన్ బిడ్డింగ్ వేసిన వారు ఉంటారో... వారు ఆ డబ్బును కేరళ రిలీఫ్ ఫండ్ కోసం డొనేట్ చేయండి. డొనేట్ చేసిన స్క్రీన్ షాట్ను [email protected] అకౌంట్కు పంపండి చేయండి. ఎవరైతే డొనేట్ చేస్తారో అందరితో మీట్ అండ్ గ్రీట్ టుగెదర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దీని వల్ల ఎక్కువ అమౌంట్ కేరళకు సహాయంగా వెళుతుందని భావిస్తున్నాను అని కార్తికేయ తెలిపారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ రాష్ట్రం భారీగా నష్ట పోయింది. వందల సంఖ్యలో వరద బీభత్సానికి బలయ్యారు. కేరళ జల విలయం కారణంగా దిక్కుతోచని పరిస్థితులో ఉన్న అక్కడి ప్రజలను ఆదుకునేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు, ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు.