‘నా ఆటోగ్రాఫ్’ దర్శకుడితో నాగార్జున
దుర్గాఆర్ట్స్ బేనర్పై ఎస్.గోపాల్ రెడ్డే ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. తొలుత తాను నిర్మాతగా మాత్రమే ఉండాలనుకున్నారు. తాను అనుకున్న దర్శకులు ఎవరూ ఈ సినిమా చేయడానికి వివిధ కారణాల వల్ల ముందుకు రాక పోవడంతో చివరకు తానే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో ఎస్.గోపాల్ రెడ్డి సంతోషం సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు.
ప్రస్తుతం నాగార్జున భాయ్ సినిమా షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రానికి పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. 'భాయ్' మూవీ ఆడియో ఆగస్టు 16న విడుదల చేసేందుకు, సెప్టెంబర్ 6న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంమై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హంసా నందిని, కామ్న జెఠ్మలానీ, నథాలియా కౌర్, సోనూసూద్, ఆశిష్ విద్యార్థి, అజయ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications
