twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నా ఆటోగ్రాఫ్’ దర్శకుడితో నాగార్జున

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : రవితేజ హీరోగా 'నా ఆటోగ్రాఫ్' చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి మరో సారి దర్శకత్వానికి సిద్ధం అవుతున్నారు. త్వరలో ఆయన నాగార్జున హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

    దుర్గాఆర్ట్స్ బేనర్‌పై ఎస్.గోపాల్ రెడ్డే ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. తొలుత తాను నిర్మాతగా మాత్రమే ఉండాలనుకున్నారు. తాను అనుకున్న దర్శకులు ఎవరూ ఈ సినిమా చేయడానికి వివిధ కారణాల వల్ల ముందుకు రాక పోవడంతో చివరకు తానే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో ఎస్.గోపాల్ రెడ్డి సంతోషం సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు.

    ప్రస్తుతం నాగార్జున భాయ్ సినిమా షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రానికి పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. 'భాయ్' మూవీ ఆడియో ఆగస్టు 16న విడుదల చేసేందుకు, సెప్టెంబర్ 6న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంమై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

    యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హంసా నందిని, కామ్న జెఠ్మలానీ, నథాలియా కౌర్‌, సోనూసూద్, ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు నటిస్తున్నారు.

    English summary
    Popular cinematographer S Gopal Reddy may soon wield megaphone. Senior and popular cinematographer S Gopal Reddy tuned director with Raviteja’s movie Autograph. It is said that S Gopal Reddy is once gain trying his hands at direction. Nagarjuna is the hero in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X