Don't Miss!
- News శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులపై కనక వర్షం
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
‘నా ఆటోగ్రాఫ్’ దర్శకుడితో నాగార్జున
దుర్గాఆర్ట్స్ బేనర్పై ఎస్.గోపాల్ రెడ్డే ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. తొలుత తాను నిర్మాతగా మాత్రమే ఉండాలనుకున్నారు. తాను అనుకున్న దర్శకులు ఎవరూ ఈ సినిమా చేయడానికి వివిధ కారణాల వల్ల ముందుకు రాక పోవడంతో చివరకు తానే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో ఎస్.గోపాల్ రెడ్డి సంతోషం సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు.
ప్రస్తుతం నాగార్జున భాయ్ సినిమా షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రానికి పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. 'భాయ్' మూవీ ఆడియో ఆగస్టు 16న విడుదల చేసేందుకు, సెప్టెంబర్ 6న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంమై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హంసా నందిని, కామ్న జెఠ్మలానీ, నథాలియా కౌర్, సోనూసూద్, ఆశిష్ విద్యార్థి, అజయ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటిస్తున్నారు.