Don't Miss!
- News ఎన్నికల ముందు గుడ్ న్యూస్..ఫుల్ జోష్లో వైసీపీ
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పదేళ్ల తరవాత...ఎస్.జానకి మళ్లీ...
ధనుష్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం 'విఐపి'. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ మెలోడీ గీతాన్ని జానకి పాడనున్నారు. ఆమెతో పాటు హీరో ధనుష్ కూడా గొంతు కలపబోతున్నారు. ''జానకి గారు పాట పాడడానికి ఒప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. కొంతకాలంగా ఆమె పాటలకు దూరంగా ఉన్నారు. సుదీర్ఘ విరామం తరావాత మా చిత్రం కోసం పాట పాడడం ఉద్వేగాన్ని కలిగిస్తోంది''అని సంగీత దర్శకుడు చెప్తున్నారు.
ఎస్. జానకి తెలుగులో తొలిసారిగా 'ఎం.ఎల్.ఏ' చిత్రం లో 'నీ ఆశ...అడయాస...లంబా డోళ్ల రాం దాసా' అనే పాటను పాడారు. తెలుగులో ఆమె టాలెంట్ను గుర్తించి ప్రముఖ నిర్మాత రామోజీ ఆమెను తన చిత్రం 'మౌనపోరాటం'కు సంగీత దర్శకత్వం చేసే అవకాశం కల్పించారు. ఆ చిత్రం సంగీతపరంగా మ్యుజికల్ హిట్ కూడా అయింది. అంతకుముందు జానకి ఉషాకిరణ్ వారి 'ప్రతిఘటన' చిత్రంలో పాడిన 'ఈ ధుర్యోదన, దుశ్సాసన, దుర్వినీతి లోకంలో' అంటూ పాడిన పాటకు అన్ని వర్గాల ప్రజలనుంచి ప్రశంస లు అందుకున్నారు. భానుమతి, పి.లీల తర్వాత జానకి మాత్రమే మహిళా సంగీత దర్శకురాలు కావడం విశేషం.
జానకి తన గాయికా జీవితంలో బిస్మిల్లాఖాన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వంటి ప్రముఖ సంగీత విద్వాంసులతో కలిసి పనిచేశారు ఆమె. ఆరుసా ర్లు జాతీయ స్థాయిలో గాయనిగా అవార్డు అందుకున్నారు. వాటిల్లో తెలుగులో వంశీ దర్శకత్వంలో ఆమె పాడిన 'సితార' చిత్రంలోని 'వెన్నెల్లో గోదారి అందం' పాటకుగాను ఉత్తమ జాతీయ గాయనిగా అవార్డు అందుకున్నారామె. మహమ్మద్ఫ్రీ, లతామంగేష్కర్, ఆశాభోస్లేలు జానకికి ఇష్టమైన సింగర్స్. ఐదు తరాల నటీమణులకు జానకి తన గళాన్ని అందించడం మరో విశేషం.
జానకి. తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం, హిందీ తదితర భాషల్లో విస్తృతంగా గానం చేసిన జానకి ఇళయ రాజా సంగీత దర్శకత్వంలో పాడిన కొన్ని అద్భుత గీతాలు ఆమె ప్రతిభకు అద్దంపడతాయి. కలైమామణి, గౌరవ డాక్టరేట్ పట్టాలాంటి పురస్కారాలు సైతం ఆమెని వరించాయి. కానీ, 74 సంవత్సరాల జానకికి ఇంతవరకూ ఒక్క పద్మ పురస్కారం కూడా రాలేదు.