Don't Miss!
- News సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
'S/O సత్యమూర్తి' ఆడియో వేడుకపై విమర్శలు...
హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'S/O సత్యమూర్తి' ఆడియో వేడుక ఆదివారం గ్రాండ్గా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆడియో వేడుక సూపర్ హిట్టయింది. అంతా బానే జరిగింది. అయితే ఓ విషయంలో మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆడియో వేడుకలో ఇటీవల స్వర్గస్తులైన ప్రముఖ నటుడు, ఈ చిత్రంలో నటించిన ఎంఎస్ నారాయణ ప్రస్తావన ఎవరూ తేక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఎంఎస్ గౌరవార్తం, ఆయన ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాల మౌనం కూడా పాటించక పోవడం గమనార్హం.
ఎమ్.ఎస్ నారాయణ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం టాలీవుడ్ను షాక్ కు గురి చేసింది. ఆయన నటిస్తున్న పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మరికొన్నింటిలో ఆయన షూటింగ్ పూర్తయినా డబ్బింగ్ పూర్తి కాలేదు. డబ్బింగ్ పూర్తికాని సినిమాల్లో బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా(సన్నాఫ్ సత్యమూర్తి) కూడా ఒకటి. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి ఎంఎస్ నారాయణ వాయిస్ పర్ ఫెక్టుగా చేసి చూపడంతో త్రివిక్రమ్ అతన్ని ఓకే చేసి డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది.
సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం ఎంఎస్ నారాయణ భీమవరం వెళ్లారు. అక్కడ ఆయనకు మలేరియా సోకడంతో 19న ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో పాటు షుగర్, కిడ్నీ, హార్ట్ సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్ కొండాపూర్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 23న మరణించారు.