Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ముంబైలో ‘సాహో’ ఛేజింగ్ సీన్లు...ఈ కారు పరిస్థితి చూశారా?
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'సాహో'. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజులుగా ముంబైలో జరుగుతోంది. ఇక్కడి అంబే వ్యాలీలో ఛేజింగ్ సీన్లు చిత్రీకరించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ నటుడు మురళీ శర్మ ట్వీట్ చేశారు.
ఛేజింగ్ సీన్లు చిత్రీకరించిన అనంతరం ఇంటికి వెళుతున్నట్లు చెబుతూ మురళీ శర్మ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఛేజింగ్ సీన్స్ చిత్రీకరణలో ధ్వంసమైన కారును ముంబై తరలిస్తున్నట్లు, అంబే వ్యాలీలో షూటింగ్ ముగిసినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
|
వైరల్ అవుతున్న వీడియో
మురళీ శర్మ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ‘సాహో' బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగులో భాగంగా ఇప్పటికే చాలా కార్లు ధ్వంసం అయ్యాయి. మురళీ శర్మ షేర్ చేసిన వీడియో ‘సాహో'లో యాక్షన్ సీన్లు ఎలా ఉండబోతున్నాయో స్పష్టం చేస్తోంది.
|
షూటింగ్ ప్యాకప్
షూటింగ్ ప్యాకప్ అంటూ శనివారం రాత్రి మురళీ శర్మ మరొక ట్వీట్ చేశారు. అయితే ఓవరల్ షూటింగ్ ఇంకా ఎప్పుడు ముగుస్తుందనేది తెలియాల్సి ఉంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘సాహో' షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
రూ. 300 కోట్ల భారీ బడ్జెట్
‘సాహో' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తెరకెక్కిస్తోంది. బడ్జెట్లో ఎక్కువ శాతం(రూ. 90 కోట్లు) యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసమే ఖర్చు చేశారు. అబుదాబిలో 60 రోజుల పాటు చిత్రీకరించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికే హైలెట్ కాబోతోంది.
అంచనాలు పెంచిన టీజర్
సినిమా ప్రమోషన్లో భాగంగా ‘షేడ్స్ ఆఫ్ సాహో' పేరుతో చాప్టర్ 1, చాప్టర్ 2 మేకింగ్ వీడియోలు విడుదల చేయగా... అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వీటి కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ హైప్ కూడా బాగా పెరిగింది. పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు.
సాహో
‘సాహో' చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.