Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సాహో దర్శకుడితో బిగ్ బడ్జెట్ యాక్షన్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన బడా నిర్మాత
రన్ రాజా రన్ సినిమాతో డిఫరెంట్ స్టైల్ లో హిట్ కొట్టిన దర్శకుడు సుజిత్ మొదటి సినిమాతోనే భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు. ఇక ఎవరు ఉహీంచని విదంగా రెండవ ఛాన్స్ అందుకున్న సుజిత్ ప్రభాస్ తో సరైన హిట్ కొట్టలేకపోయాడు. సాహో సినిమాతో అంచనాలను అందుకోలేకపోయిన యువ దర్శకుడు సుజిత్ గత కొంత కాలంగా తన మూడవ ప్రాజెక్టును సెట్స్ పైకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా ప్రాజెక్ట్ సెట్టయినట్లు ఒక బాలీవుడ్ బడా నిర్మాత క్లారిటీ ఇచ్చారు.
బాలీవుడ్ లో హిట్టయిన సాహో
రన్ రాజా రన్ సినిమాతో మొదటి హిట్ అందుకున్న అనంతరం ప్రభాస్ పిలిచి మరి సాహో చేసే అవకాశం ఇచ్చాడు. సాహో సినిమా బాలీవుడ్ లో అయితే ఒక మోస్తరుగా మంచి రెస్పాన్స్ అందుకుందనే చెప్పాలి. అక్కడ ఓపెనింగ్స్ కూడా గట్టిగానే వచ్చాయి. అయితే సుజిత్ ఆ వెంటనే యూవీ క్రియేషన్స్ లోనే మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ అది వర్కౌట్ కాలేదు.
మెగాస్టార్ తో అనుకున్నారు..కానీ..
సుజిత్ కు వేరే ప్రొడక్షన్ నుంచి ఆఫర్స్ కూడా వచ్చయట. కానీ ఎందుకో సాహో విడుదలై ఏడాది దాటినా మరో సినిమాను తొందరగా సెట్ చేసుకోలేకపోయాడు. మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ కు ఆల్ మోస్ట్ డైరెక్టర్ గా ఫిక్స్ అయినట్లు టాక్ వచ్చింది. అయితే స్క్రిప్ట్ రెడీ చేసిన విధానంలో మెగాస్టార్ అంచనాలను అందుకోలేకపోయాడట. ఇక చివరికి న్యాయం చేయలేక సుజిత్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు కూడా టాక్ వచ్చింది.
ఆ హీరోతో కాదు..
ఇక ఆ తరువాత పెళ్లి చేసుకున్న సుజిత్ మళ్ళీ కొత్త తరహా స్టోరీని రెడీ చేసుకున్నట్లు చెప్పాడు. గోపీచంద్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య రూమర్స్ బాగానే వచ్చాయి. యూవీ క్రియేషన్స్ లో ఇదివరకే గోపిచంద్ జిల్ సినిమా చేశాడు. ఆ ప్రాజెక్టు తెరకెక్కడానికి కారణం ప్రభాస్ అని అని కూడా రూమర్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో అది నిజం కాదని క్లారిటీ వచ్చేసింది.
క్లారిటీ ఇచ్చిన బడా జీ స్టూడియోస్
సుజిత్ ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టినట్లు రూమర్స్ వస్తున్నాయి. జీ స్టూడియోస్ సీఈఓ షరీఖ్ పటేల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ తరువాత సినిమాను సుజిత్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఆ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని స్టోరీ కూడా ఆల్ మోస్ట్ సెట్టయినట్లు చెప్పారు.
ఆ హీరోతోనే..
అయితే సుజిత్ ఏ హీరోతో చేస్తాడనే విషయాన్ని ఇంకా అధికారికంగా చెప్పలేదు. అయితే యూరి సినిమాతో ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేసిన కథానాయకుడు విక్కీ కౌషల్ తో సుజిత్ సినిమా చేయబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు అయితే వెలువడుతున్నాయి. స్క్రిప్ట్ పై ఇటీవల చర్చలు జరిపినట్లు సమాచారం. సాహో బాలీవుడ్ లో మంచి హిట్ టాక్ ను అందుకుందని సుజిత్ అటు వైపు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ సినిమాతో తన లెవెల్ ని మరో స్థాయికి పెంచుకోవాలని అడుగులు వేస్తున్నాడట. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.