Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘సాహో’ చూశాక ప్రభాస్ అభిమానులుగా గర్వపడతారు: అరుణ్ విజయ్
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' మరో పది రోజుల్లో(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాహో మూవీలో ఉపయోగించిన వస్తువులు, వాహనాలు కూడా ప్రదర్శనకు ఉంచడం గమనార్హం. వేలాది మంది అభిమానులు ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలి వచ్చారు.
Photo Gallery: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్
వారి వల్లే నేను ఈ సినిమాలో...
ఈ సందర్భంగా సినిమాలో మనోజ్ విశ్వాంక్ పాత్ర పోషించిన అరుణ్ విజయ్ ప్రసంగిస్తూ ... ‘ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుజీత్ గారికి, నిర్మాత ప్రమోద్ గారికి, ఈ క్యారెక్టర్ నేను చేస్తే బావుంటుందని చెప్పిన మన రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ గారికి థాంక్స్' అని వ్యాఖ్యానించారు.
మన డార్లింగ్ ఇపుడు ప్యాన్ ఇండియా స్టార్
ఈ సినిమాకు ఇంత మంది ప్రముఖులతో కలిసి పని చేయడం వండర్ఫుల్ ఎక్స్ పీరియన్స్. మనం అంతా గర్వించాల్సిన సమయం ఇది. ప్రభాస్ సర్ నెక్ట్స్ లెవల్కు వెళ్లారు. ఆయన ఇపుడు ప్యాన్ ఇండియా స్టార్. సుజీత్ చాలా చిన్నవాడు.. కానీ ఆయన పని తీరు చూసి ఆశ్చర్యపోయాను. ఇందులో ఎంతో మంది సూపర్ టెక్నీషియన్లు పని చేశారు. సుజీత్ సినిమాను తెరకెక్కించిన విధానం అభిమానులకు ఒక ట్రీట్ లా ఉంటుందని తెలిపారు.
కొత్త ప్రభాస్ను చూస్తారు
ఇది నాకు మొదటి త్రిభాషా చిత్రం. ఇలాంటి సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. యాక్షన్ సీన్లు కొరియోగ్రఫీ చేసిన తీరు సూపర్బ్. ఈ సినిమాకు ప్రభాస్ సర్ చాలా కష్టపడి, డెడికేషన్తో పని చేశారు. ఏ చిన్న కరెక్షన్ అయినా దాన్ని మళ్లీ ఉత్సాహంగా చేసేవారు. ఈ సినిమా చూశాక ప్రభాస్ అభిమానులుగా మీరంతా గర్వపడతారు. ఒక కొత్త ప్రభాస్ను చూస్తారు.
సాహో
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు.. రెబల్స్టార్ ప్రభాస్, శ్రధ్ధాకపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు..