Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘సాహో’ ఈవెంట్: ప్రభాస్తో డ్యాన్స్ చేయించా.. అప్పుడు ఇద్దరం కొట్టుకున్నాం: దిల్ రాజు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' మరో పది రోజుల్లో(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు.
Photo Gallery: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్
ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్
ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాహో మూవీలో ఉపయోగించిన వస్తువులు, వాహనాలు కూడా ప్రదర్శనకు ఉంచడం గమనార్హం. వేలాది మంది అభిమానులు ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలి వచ్చారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి భారీగా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండడంతోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేశారు.
ఫ్యాన్స్తో సెల్ఫీ.. యూనిట్పై ప్రశంసలు
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. అంతకు ముందు కార్యక్రమానికి వచ్చిన ఫ్యాన్స్తో సెల్ఫీ దిగాడాయన. అనంతరం మాట్లాడుతూ దర్శకుడు, నిర్మాతలపై ప్రశంసల వర్షం కురింపించాడు. ఆల్ ఇండియా సినిమా చేయడానికి రాజమౌళి గారికి 15 సంవత్సరాలు పడితే.. సుజిత్ కేవలం తన రెండో సినిమాతోనే అది చేసి చూపించాడని దిల్ రాజు అన్నారు. ట్రైలర్ చాలా బాగుందని సినిమా కూడా హిట్ అవుతుందని అన్నారు.
ప్రభాస్తో డ్యాన్స్ చేయించా
అలాగే, చిత్ర హీరో ప్రభాస్ గురించి స్పందిస్తూ.. ‘మిర్చి సినిమా ఫంక్షన్లో ప్రభాస్తో డ్యాన్స్ చేయించాను. అవసరమైతే ఇప్పుడు కూడా స్టెప్ వేయించుతా. ఆరు సంవత్సరాల్లో మూడు సినిమాలు చేశాడు. వాటిలో బాహుబలి 1, బాహుబలి 2 హిట్లు కొట్టాడు. ఇప్పుడు సాహోతో ఏ రేంజ్ హిట్ కొట్టబోతున్నాడో ట్రైలర్లో చూపించాడు. ప్రభాస్ దగ్గరకు వెళ్తుంటే స్టార్ హీరోలా అనిపించడు.. ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నట్లు అనిపిస్తుంది' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
ఇద్దరం కొట్టుకున్నాం
అంతేకాదు, ప్రభాస్తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేసేటప్పుడు ఇద్దరం కొట్టుకునే వాళ్లం. ఇదొక్కటే కాదు మా ఇద్దరి మధ్య ఎన్నో మర్చిపోలేని సంఘటనలు జరిగాయి. అలాగే ప్రభాస్తో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏ స్టేట్ వెళ్లినా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలాగే నీ సినిమాలన్నీ కుమ్మేయాలి అని కోరుకుంటున్నాను. బాహుబలి సినిమాల్లాగే ఇది కూడా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్' అని పేర్కొన్నారు.
సాహో గురించి
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సాహో చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రెబల్స్టార్ ప్రభాస్ సరసన శ్రధ్ధాకపూర్ నటించగా జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు.