Don't Miss!
- News సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
రాజమౌళికి 15 ఏళ్ళు పట్టింది.. కానీ నీకు.. సాహో డైరెక్టర్పై దిల్ రాజు కామెంట్స్
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' మరో పది రోజుల్లో(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాహో మూవీలో ఉపయోగించిన వస్తువులు, వాహనాలు కూడా ప్రదర్శనకు ఉంచడం గమనార్హం. వేలాది మంది అభిమానులు ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలి వచ్చారు.
Photo Gallery: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్
దిల్ రాజు ఆసక్తికర మాటలు.. అభిమానుల్లో జోష్
ఈ వేదికపై టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఆసక్తికరంగా మాట్లాడి ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపారు. ఈ క్రౌడ్తో సెల్ఫీ దిగాలని ఉందని, మళ్ళీ ఇలాంటి అరుదైన అవకాశం వస్తుందో రాదో అని అన్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ స్వాగతం పలుకుతూ ప్రభాస్తో వేదికపై స్టెప్ వేపిస్తానని తెలిపాడు.
రాజమౌళి గురించి మాట్లాడుతూ..
ఒక తెలుగు సినిమాను ఆల్ ఇండియా లెవెల్లో చూపించి సత్తా చాటిన రాజమౌళి గారికి ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున థాంక్స్. బాహుబలి తర్వాత ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా డబ్బు సంపాదించుకోవాలని చూస్తారు. సాహో కోసం బాహుబలి 2 ని మించి బడ్జెట్ పెట్టారు. కాబట్టి సాహో నిర్మాతలను అడిగాను.. ఏంటి? ఈ బడ్జెట్ ఏంటి అని. అన్నా ప్రభాస్ కోసం అని ఒక్కటే మాట చెప్పారు. యూవీ నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. నన్ను చూసి మీరు సినిమా తీస్తాం అని మీరు చెబుతుంటారు. కానీ ఇప్పుడు నేను చెబుతున్నా.. మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటున్నా ఆలా ఇండియా లెవెల్ సినిమా ఎలా తీయాలో. ట్రైలర్ చూశాక తెలిసింది ఈ సినిమా ఎలా తీశారో.. అన్నాడు దిల్ రాజు.
సుజీత్ ఏం అదృష్ట వంతుడవయ్యా నువ్వు
సుజీత్ ఏం అదృష్ట వంతుడవయ్యా నువ్వు అంటూ సాహో డైరెక్టర్ సుజీత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు దిల్ రాజు. రాజమౌళి గారికి 15 సంవత్సరాలు పట్టింది తెలుగు సినిమాను ఆల్ ఇండియా లెవెల్కి తీసుకుపోవడానికి. కానీ నువ్వు రెండో సినిమాకే ప్రభాస్ తో ఆల్ ఇండియా లెవెల్ సినిమా తీశావు. హ్యాట్సాఫ్. మొన్న ట్రైలర్ నీ విజన్ చూసి తెలుగు సినిమా ఆల్ ఇండియా లెవెల్ డైరెక్టర్ గా ఎదిగేలా కనిపిస్తున్నావు అన్నాడు దిల్ రాజు.
సాహో మూవీ
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సాహో చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో రెబల్స్టార్ ప్రభాస్ సరసన శ్రధ్ధాకపూర్ నటించగా జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు.