Don't Miss!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్: వచ్చిన వాళ్లందరికీ సినిమా చూపించారు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' మరో పది రోజుల్లో(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు.
Photo Gallery: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్
ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాహో మూవీలో ఉపయోగించిన వస్తువులు, వాహనాలు కూడా ప్రదర్శనకు ఉంచడం గమనార్హం. వేలాది మంది అభిమానులు ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలి వచ్చారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి భారీగా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండడంతోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు సినీ చరిత్రలోనే భారీ సక్సెస్ను అందుకోవడమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమ స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన 'బాహుబలి' రెండు పార్టులకు సంబంధించిన సన్నివేశాలతో జానెల్ డ్యాన్స్ గ్రూప్ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చింది. దాదాపు 20 నిమిషాల పాటు ఈ డ్యాన్స్ బృందం చేసిన యాక్ట్ ఫంక్షన్కు వచ్చిన వారందరికీ 'బాహుబలి' రెండు సినిమాలను చూపించినట్లైంది. ఈ ప్రదర్శనతో ప్రభాస్ అభిమానులు మరోసారి గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ యాక్ట్ వస్తున్నంత సేపు కేకలు, ఈలలు వేస్తూ తమ ఆనందాన్ని కనబరిచారు.
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సాహో చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రెబల్స్టార్ ప్రభాస్ సరసన శ్రధ్ధాకపూర్ నటించగా జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు.