Don't Miss!
- News పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమన్నారంటే?
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
అది చూసి అబ్బో అన్నారు... ప్రభాస్ ఇంటర్నేషనల్ స్థార్ అవుతాడు: కృష్ణం రాజు
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' మరో పది రోజుల్లో(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణం రాజు మాట్లాడుతూ... ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినపుడు అందులో ప్రభాస్ ఇంకా కనిపిస్తే బావుండు అన్నారు. కొన్ని పోస్టర్లు విడుదల చేసిన తర్వాత సూపర్ అన్నారు. టీజర్ రిలీజైన తర్వాత ఆహో ఓహో అన్నారు. మొన్న ట్రైలర్ రిలీజైన తర్వాత అబ్బో అన్నారు. ఆ అబ్బో అనేది ఎక్కడి వరకు వెళ్లిందంటే ఇంటర్నేషనల్ లెవల్కు వెళ్లింది. చాలా గొప్ప సినిమా, హాలీవుడ్ సినిమాతో పోటీపగల సినిమా అని చాలా మంది ఫోన్లు చేసి చెప్పారు.
Photo Gallery: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్
నిజమే... ఎందుకంటే ఈ సినిమాకు ఆ చేజింగ్ సీన్లు, యాక్షన్ సీన్లు చేసింది కెన్నీ బేట్స్... ఈ ప్రపంచంలోని టాప్ స్టంట్ మాస్టర్లలో ఒకరు. రాజమౌళిగారితో మాకు చాలా మంచి అనుబంధం ఉంది. మా ఫ్యామిలీ ఫ్రెండ్. అతడికి చెప్పకుండా ప్రభాస్ ఏమీ చేయడు. ఆయనకు కథ చెప్పినపుడు ఓకే అన్నారట.
రెండు మూడు రోజుల క్రితం ప్రభాస్కు ఒకటే చెప్పాను. ఏమీ కంగారుపడొద్దు... నువ్వు పడ్డ కష్టానికి, సినిమా ఔట్ పుట్ వచ్చిన దానికి తప్పకుండా సక్సెస్ అవుతుంది. సుజీత్ చిన్నవాడైనా ఇంత పెద్ద టాస్క్ అతడికి అప్పచెప్పడం, దాన్ని అద్భుతంగా చేయడం జరిగింది. ఈ సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అవుతారనే నమ్మకం ఉంది. నా ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీర్వాదం ఉంటుంది అని కృష్ణం రాజు తెలిపారు.
యువీ
క్రియేషన్స్
అధినేతలు
వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్
లు
ఏ
విషయంలోనూ
రాజీ
పడకుండా
అత్యంత
భారీ
బడ్జెట్
తో
ఏక
కాలంలో
తెలుగు,
తమిళ,
హిందీ
భాషల్లో
ఈ
చిత్రాన్ని
నిర్మించారు.
నటీనటులు..
రెబల్స్టార్
ప్రభాస్,
శ్రధ్ధాకపూర్,
జాకీషరఫ్,
నీల్
నితిన్
ముఖేష్,
అరుణ్
విజయ్,
లాల్,
వెన్నెల
కిషోర్,
ప్రకాష్
బెల్వాది,
ఎవిలిన్
శర్మ,
చుంకి
పాండే,
మందిరా
బేడి,
మహేష్
మంజ్రేఖర్,
టిను
ఆనంద్,
శరత్
లోహితష్వా
తదితరులు..