Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
ఏప్రిల్ 18న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాక్ష్యం టీజర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'సాక్ష్యం'. డిక్టేటర్ ఫేమ్ శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ను బుధవారం (ఏప్రిల్ 18న) విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సాయి శ్రీనివాస్ గత చిత్రం 'జయ జానకి నాయక'కు బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. 'లక్ష్యం', 'లౌక్యం' వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.
ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం అమెరికాలో లాస్ట్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 11న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
యాక్షన్ సీన్స్, డాన్స్ లాంటి అంశాల్లో సాయి శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో హీరో చేసే స్టంట్స్ సినిమాకే హైలెట్ గా ఉంటాయని చిత్రం బృందం చెబుతోంది.
ఈ చిత్రంలో జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మర్షవర్ధన్ సంగీతం అందిస్తున్నారు.