Don't Miss!
- News ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
సాహో కోసం మరో భారీ సెట్.. రామోజీ సిటీలో కళ్లు చెదిరేలా సముద్రంపై వంతెన
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న సాహో చిత్రం భారీ హంగులతో రిలీజ్కు ముస్తాబవుతున్నది. దుబాయ్లో సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసి ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే యాక్షన్ సీన్లు చిత్రీకరించిన విషయం తెలిసిందే. 40వ దశకంలోని పరిస్థితులు, స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన కథా నేపథ్యంతో సాహో రూపొందుతుండటం వల్ల భారీగా సెట్లు వేసి చిత్రీకరిస్తున్నారు.
ప్రస్తుతం సాహో చివరి షెడ్యూల్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నది. ఈ చిత్రం కోసం ముంబై సెటప్ను సెట్గా వేశారు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వినూత్నంగా బాంద్రా, వర్లీ సముద్రంపై ఉండే రహదారి సెట్కు రూపకల్పన చేశారు. బాంద్రా, వర్లీ సముద్ర వంతెనపై యాక్షన్ సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం మరోసారి భారీ బడ్జెట్తో సెట్ను వేయడం గమనార్హం.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు శ్రద్ధాకపూర్, జాకీ ష్రాఫ్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్తోపాటు తమిళ హీరో అరుణ్ విజయ్ కూడా నటిస్తున్నాడు. రన్ రాజా రన్ చిత్రం దర్శకుడు సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్ బ్యానర్పై ఈ సినిమా రూపొందుతున్నది.