ఎవరైనా ఓకె :సదా

ప్రస్తుతం 'రోజాపూలు' ఫేం శ్రీరామ్ కథానాయకుడిగా, ఎస్.పి.ఆర్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నూకారపు సూర్యప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం 'బృందావనం' లో ఆమె కనిపించటానికి కమిటయ్యింది. ఈ చిత్రం ద్వారా సి.ఆర్.ఆర్.కృష్ణని అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు. అతను లేడీ సినిమాటోగ్రాఫర్ విజయశ్రీ భర్త. ఈ చిత్రం జూన్ నెల రెండవ వారంలో ప్రారంభం కానుంది. లవ్, మ్యూజికల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి మరుధూరి రాజా సంభాషణలు రాస్తున్నారు. మణిశర్మ ఆధ్వర్యంలో ప్రస్తుతం మ్యూజికల్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దాంతో ఒకప్పుడు కథ,బ్యానర్ వ్యాల్యూ, పేరున్న హీరో,పెద్ద దర్శకుడు కావాలంటూ వగలు పోయిన ఆమె పరిస్థితి కాస్త మారేసరికి ఎవరైనా ఓ.కె అంటూ ఇలా కాళ్ళ బేరానికి వస్తోంది అంటూ వెనుక ఫిల్మ్ నగర్ వాసులు ఎగతాళిగా నవ్వుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











