Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
యాంకర్ ప్రదీప్ ఫండ్ రైజింగ్ ఈవెంట్, ఎంట్రీ ఫీజు రూ.100 మాత్రమే!
ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్, సహృదయ ఫౌండేషన్ వారు కలిసి డిసెంబర్ 16న ఒక ఫైండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ యాంకర్ ప్రదీప్ ఒక వీడియో షేర్ చేశారు. హైదరాబాద్లోని ఒయాసిస్ స్కూల్లొ ఈ ఈవెంట్ జరకుగబోతున్నట్లు తెలుస్తోంది.
''నేను, సహృదయ ఫౌండేషస్ వారు కలిసి డిసెంబర్ 16న ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేద్దామనుకుంటున్నాం. మాకు తెలిసిన ఒక రెండు అనాధశరణాలయాలు ఉన్నాయి. అందులో ఉన్న పిల్లల చదువు, ఫుడ్, మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయాలనుకుంటున్నాం'' అని ప్రదీప్ తెలిపారు.
ఇందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈ ఈవెంటులో పాల్గొనడానికి ఎంట్రీ ఫీజు రూ. 100 మాత్రమే. మీరు ఈ వెంటును చూడటమే కాకుండా మీరూ పెర్ఫార్మ్ చేయవచ్చు. సింగింగ్, మ్యూజిక్, డాన్స్, కామెడీ స్కిట్ ఇలా ఏదైనా చేయవచ్చు. అలా చేయాలనుకున్న వారి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 150 కలెక్ట్ చేస్తాం. దీని ద్వారా వచ్చే ప్రతి పెన్నీ ఆ పిల్లలకు ఉపయోగపడుతుందని ప్రదీప్ తెలిపారు.
ప్రదీప్ టీవీ షోస్ విషయానికొస్తే... అతడి రీసెంట్ టీవీ రియాల్టీ షో 'పెళ్లి చూపులు' పెద్ద ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులను ఈ షో ఆకట్టుకోలేక పోయింది. అయినప్పటికీ ఇతర ఎంటర్టెనింగ్ షోలతో ప్రదీప్ తెలుగు టీవీ రంగంలో నె.1 యాంకర్గా రాణిస్తున్నారు.