twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ ప్రదీప్‌ ఫండ్ రైజింగ్ ఈవెంట్, ఎంట్రీ ఫీజు రూ.100 మాత్రమే!

    |

    ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్, సహృదయ ఫౌండేషన్ వారు కలిసి డిసెంబర్ 16న ఒక ఫైండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ యాంకర్ ప్రదీప్ ఒక వీడియో షేర్ చేశారు. హైదరాబాద్‌లోని ఒయాసిస్ స్కూల్‌లొ ఈ ఈవెంట్ జరకుగబోతున్నట్లు తెలుస్తోంది.

    ''నేను, సహృదయ ఫౌండేషస్ వారు కలిసి డిసెంబర్ 16న ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేద్దామనుకుంటున్నాం. మాకు తెలిసిన ఒక రెండు అనాధశరణాలయాలు ఉన్నాయి. అందులో ఉన్న పిల్లల చదువు, ఫుడ్, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కోసం ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయాలనుకుంటున్నాం'' అని ప్రదీప్ తెలిపారు.

    Sahrdaya foundation fundraising event with Anchor Pradeep

    ఇందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈ ఈవెంటులో పాల్గొనడానికి ఎంట్రీ ఫీజు రూ. 100 మాత్రమే. మీరు ఈ వెంటును చూడటమే కాకుండా మీరూ పెర్ఫార్మ్ చేయవచ్చు. సింగింగ్, మ్యూజిక్, డాన్స్, కామెడీ స్కిట్ ఇలా ఏదైనా చేయవచ్చు. అలా చేయాలనుకున్న వారి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 150 కలెక్ట్ చేస్తాం. దీని ద్వారా వచ్చే ప్రతి పెన్నీ ఆ పిల్లలకు ఉపయోగపడుతుందని ప్రదీప్ తెలిపారు.

    ప్రదీప్ టీవీ షోస్ విషయానికొస్తే... అతడి రీసెంట్ టీవీ రియాల్టీ షో 'పెళ్లి చూపులు' పెద్ద ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులను ఈ షో ఆకట్టుకోలేక పోయింది. అయినప్పటికీ ఇతర ఎంటర్టెనింగ్ షోలతో ప్రదీప్ తెలుగు టీవీ రంగంలో నె.1 యాంకర్‌గా రాణిస్తున్నారు.

    English summary
    Sahrdaya foundation and Anchor Pradeep fundraising event on dec 16th 10am-3pm at Oasis School. Pradeep Machiraju is an Indian Telugu television presenter and actor. He won State Nandi award as Best Anchor in 2014 for the show Gadasari Atta Sogasari Kodalu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X