Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
యాంకర్ ప్రదీప్ ఫండ్ రైజింగ్ ఈవెంట్, ఎంట్రీ ఫీజు రూ.100 మాత్రమే!
ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్, సహృదయ ఫౌండేషన్ వారు కలిసి డిసెంబర్ 16న ఒక ఫైండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ యాంకర్ ప్రదీప్ ఒక వీడియో షేర్ చేశారు. హైదరాబాద్లోని ఒయాసిస్ స్కూల్లొ ఈ ఈవెంట్ జరకుగబోతున్నట్లు తెలుస్తోంది.
''నేను, సహృదయ ఫౌండేషస్ వారు కలిసి డిసెంబర్ 16న ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేద్దామనుకుంటున్నాం. మాకు తెలిసిన ఒక రెండు అనాధశరణాలయాలు ఉన్నాయి. అందులో ఉన్న పిల్లల చదువు, ఫుడ్, మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయాలనుకుంటున్నాం'' అని ప్రదీప్ తెలిపారు.
ఇందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈ ఈవెంటులో పాల్గొనడానికి ఎంట్రీ ఫీజు రూ. 100 మాత్రమే. మీరు ఈ వెంటును చూడటమే కాకుండా మీరూ పెర్ఫార్మ్ చేయవచ్చు. సింగింగ్, మ్యూజిక్, డాన్స్, కామెడీ స్కిట్ ఇలా ఏదైనా చేయవచ్చు. అలా చేయాలనుకున్న వారి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 150 కలెక్ట్ చేస్తాం. దీని ద్వారా వచ్చే ప్రతి పెన్నీ ఆ పిల్లలకు ఉపయోగపడుతుందని ప్రదీప్ తెలిపారు.
ప్రదీప్ టీవీ షోస్ విషయానికొస్తే... అతడి రీసెంట్ టీవీ రియాల్టీ షో 'పెళ్లి చూపులు' పెద్ద ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులను ఈ షో ఆకట్టుకోలేక పోయింది. అయినప్పటికీ ఇతర ఎంటర్టెనింగ్ షోలతో ప్రదీప్ తెలుగు టీవీ రంగంలో నె.1 యాంకర్గా రాణిస్తున్నారు.